Jammu & Kashmir: Six Killed In Massive Fire At DSP's Home In Kathua

కథువాలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కథువాలో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఊపిరాడక ఆరుగురు చనిపోయారు. మ‌రో నలుగురు వ్యక్తులు అపస్మారక స్థితిలో ఉన్నారు. నలుగురిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కతువాలోని శివ నగర్‌లో కేశవ్ రైనా (81) కుమారుడు రిటైర్డ్ డీఎస్పీ అవతార్ కృష్ణ ఇంట్లో అర్థరాత్రి అనుమానాస్పద స్థితిలో మంటలు చెలరేగాయి. ఊపిరాడక ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు మృతి చెందారు. వీరిలో చాలా మంది పిల్లలు ఉన్నారు. కాగా నలుగురు అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. నలుగురిని ఆసుపత్రిలో చేర్చారు. మృతుల్లో రిటైర్డ్ డీఎస్పీ కూడా ఉన్నారు.

ముగ్గురిని ఇంటి నుంచి రక్షించి ఆస్పత్రికి తరలించారు. అయితే రక్షించే క్రమంలో పొరుగువారికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. జీఎంసీ కథువా ప్రిన్సిపల్ సురీందర్ అత్రి ప్రకారం.. ప్ర‌మాదం కార‌ణంగా ఊపిరాడక మరణించిన‌ట్లు ప్రాథమిక విచార‌ణ‌లో తేలింది. మృతుల్లో నలుగురు మైనర్లు కాగా.. వీరిలో ఇద్దరు మూడు నుంచి నాలుగేళ్ల చిన్నారులు. “రిటైర్డ్ అసిస్టెంట్ మేట్రన్ అద్దె ఇంట్లో మంటలు చెలరేగాయి. 10 మందిలో ఆరుగురు మరణించారు, నలుగురు గాయపడ్డారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాలను బయటకు తీస్తారు,” అత్రి చెప్పారు.

కాగా, అగ్ని ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఇంటికి మంటలు అంటుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts
విజయ్ చౌక్ ఇండియా కూటమి ఎంపీల నిరసన
MPs of INDIA Alliance prote

శీతాకాల సమావేశాల చివరి రోజున కూడా పార్లమెంటు వేదికపై ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇండియా కూటమి ఎంపీలు విజయ్ చౌక్ వద్ద నిరసనకు దిగారు. అంబేడ్కర్ పై అమిత్ Read more

ISRO-NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం
ISRO NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం

ISRO-NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం ప్రతి 12 రోజులకు దాదాపు భూమి మొత్తం మరియు మంచును స్కాన్ చేస్తుంది, అలాగే ఇది అధిక రిజల్యూషన్ కలిగి ఉంటుంది. Read more

రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి
Nobel Prize in Chemistry for three scientists

స్టాక్‌హోం: రసాయన శాస్త్ర విభాగంలో 2024 సంవత్సరానికి నోబెల్ బహుమతిని ప్రకటించారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకారం.. ఈ సంవత్సరం ముగ్గురికి ఈ గౌరవం Read more

వర్సిటీల్లో 3,282 పోస్టులు..ఈ ఏడాదే భర్తీ : లోకేశ్
3,282 vacant posts in universities will be filled this year.. Lokesh

అమరావతి: సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, ఉద్యోగుల వివరాలు, ఖాళీల భర్తీ, యూనివర్సిటీల అభివృద్ధిపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *