Jagan జగన్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు

Jagan : జగన్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు

వైసీపీ అధినేత జగన్ ఈరోజు శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గాన్ని సందర్శించారు.ఇటీవల హత్యకు గురైన కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు.అక్కడి నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన జగన్, పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.“వైసీపీ అధికారంలోకి వస్తే, మీ యూనిఫామ్ లేపేస్తాం.ఉద్యోగాలే లేకుండా చేస్తాం” అంటూ పోలీసులకు గట్టి హెచ్చరిక ఇచ్చారు.”బట్టలూడదీసి కొడతాం” అనే మాటలతో తన ఆవేశాన్ని బయటపెట్టారు. టీడీపీకి జోలపడి వైసీపీ శ్రేణులను భయపెడతారా? అంటూ మండిపడ్డారు.హత్యకు గురైన లింగమయ్య కుటుంబానికి తాను పూర్తిగా అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పారు.“ఇక్కడ రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ నడుస్తోంది” అంటూ ఆరోపణలు చేశారు.“చాలా చోట్ల టీడీపీ ఓడిపోయింది.50 స్థానాల్లో ఎన్నికలు జరిగితే, 39 చోట్ల వైసీపీ గెలిచింది,” అని జగన్ వివరించారు.

Advertisements
Jagan జగన్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు
Jagan జగన్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు

టీడీపీకి బలం లేకపోయినా, అధికార తలంపుతోనే ఎన్నికల్లో నిలుస్తోందని ఎద్దేవా చేశారు.“సీఎంగా ఉన్నాననే అహంకారంతో ఆయన వ్యవహరిస్తున్నారు.పూర్తిగా నియంతలాగా పాలిస్తున్నారు,” అని చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు చేతిలో ఉన్న శక్తిని తమ లాభానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు.పినెళ్లి రామకృష్ణారెడ్డిపై కుట్ర పూరితంగా కేసులు పెట్టారని జగన్ విమర్శించారు. నటుడు పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. నందిగం సురేశ్‌ను 145 రోజులు జైలులో ఉంచారని ఆరోపించారు.“ఇవి అన్నీ టీడీపీ–పోలీసుల కలయికతో జరుగుతున్న కుట్రలు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే,” అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని, నిజం ఎప్పటికీ వెలుగులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read also : YS Jagan: పవన్ కుమారుడి ప్రమాదంపై స్పందించిన జగన్

Related Posts
తిరుమల మృతులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా
ttd temple

టీటీడీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. కాగా తిరుపతి తొక్కిసలాటలో మృతిచెందిన వారికి ఏపీ ప్రభుత్వం భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి Read more

Etela Rajender : డీలిమిటేషన్‌తో ఎంపీ సీట్లు తగ్గుతాయని కేంద్రం ఎక్కడ చెప్పింది : ఈటల
Where did the Center say that MP seats will decrease with delimitation.. Etela Rajender

Etela Rajender : మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ లోక్‌‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‌పై ప్రాంతీయ పార్టీల వలే కాంగ్రెస్ దిగజారి Read more

నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన
ys Jagan will have an important meeting with YCP leaders today

విజయనగరం జిల్లా గుర్లలో మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఆయన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు గుర్లలో చేరుకుంటారు. Read more

Aurangzebs Tomb : ఔరంగజేబు సమాధిని రక్షించాలంటూ ఐక్య‌రాజ్య‌స‌మితికి లేఖ
Letter to the United Nations to protect Aurangzeb's tomb

Aurangzebs Tomb : మ‌హారాష్ట్ర‌లోని శాంభాజీ న‌గ‌ర్ జిల్లాలో మొఘ‌ల్ చక్ర‌వ‌ర్తి ఔరంగ‌జేబు స‌మాధి ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మాధిని తొల‌గించాల‌ని ఇటీవ‌ల ఆ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×