Jagan invited Shailajanath wearing a party scarf

శైలజానాథ్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్..

అమరావతి: మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. కండవా కప్పి పార్టీలోకి వైఎస్‌ జగన్ ఆహ్వానించారు. శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ మెంబర్‌, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌ రెడ్డి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా శైలజానాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమన్నారు. ప్రజల తరుపున వైఎస్‌ఆర్‌సీపీ పోరాడుతుందన్నారు. వైఎస్‌ జగన్ రాజకీయ విధానాలు నచ్చటం వల్లే వైసీపీలోకి చేరానని తెలిపారు.

image

కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తోందని.. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చటం లేదని శైలజానాథ్‌ అన్నారు. ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. రాయలసీమలో ప్రజల కష్టాలు తీర్చేందుకు నా వంతు పనిచేస్తా.. రాజకీయాలు ప్రజా ప్రయోజనాల కోసం చేయాలే కానీ ఆర్ధిక ప్రయోజనాల కోసం కాదు. కాంగ్రెస్ నుంచి మరికొందరు నేతలు వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరు వస్తారనేది ఇప్పుడే చెప్పలేం. జగన్ ఏ బాధ్యత అప్పగించినా నా శక్తి మేరకు పనిచేస్తా అని శైలజానాథ్‌ చెప్పారు.

శైలజానాథ్ వైసీపీలో చేరిన సమయంలో ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. శైలజానాథ్ తో పాటు వచ్చిన వారిని జగన్ ఆప్యాయంగా పలకరించారు. కాగా, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా శైలజానాథ్ గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశారు. 2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.

Related Posts
ఎమ్మెల్సీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం !
Pawan Kalyan key decision on MLC elections!

అమరావతి: ఏపీలో ఎమ్మెల్సీకలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎన్నికల బరిలో నిలిచేది Read more

కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారు – ఎర్రబెల్లి
kcr

త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన Read more

ప్లాస్టిక్ సర్జరీ ప్రచారం పై లేడి సూపర్ స్టార్ క్లారిటీ
NAYAN

తాను ఫేస్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని జరుగుతున్న ప్రచారంపై లేడీ సూపర్ స్టార్ నయనతార క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రచారంలో నిజం లేదని తాజాగా ఓ Read more

జనసేన ఒక అవినీతి కుటుంబ పార్టీ : కేఏ పాల్
జనసేన ఒక అవినీతి కుటుంబ పార్టీ కేఏ పాల్

జనసేన ఒక అవినీతి కుటుంబ పార్టీ : కేఏ పాల్ జనసేన ఎంపీ అభ్యర్థిగా నాగబాబు: కేఏ పాల్ స్పందన జనసేన పార్టీ నుండి ఎమ్మెల్యే కోటా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *