అభివృద్ధిపై చర్చించుకున్నామని వెల్లడి..

అభివృద్ధిపై చర్చించుకున్నామని వెల్లడి..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పదిమంది రహస్యంగా సమావేశమైన వార్త శనివారం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ సమావేశానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాయకత్వం వహించారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై ఆయన స్పందించారు. మా సమావేశం వాస్తవమే, కానీ అందులో ఎటువంటి రహస్యం లేదు అని క్లారిఫై చేశారు. రహస్యంగా సమావేశం కావాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.అనిరుధ్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ, తన వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపిస్తే నేను తట్టుకోను అని హెచ్చరించారు. తాజాగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను రెవెన్యూ మంత్రి వద్ద ఏ ఫైలు పెట్టలేదని చెప్పారు.

Advertisements

నాకు పెట్టానని చెప్పిన ఫైల్ గురించి నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవిని అడగాలని అన్నారు.ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించడంలో తప్పేముంది అంటూ అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు.అయితే, పార్టీ అధిష్టానానికి చెబుతూ చాలా విషయాలు చెప్పాల్సి ఉంది అని కూడా తెలిపారు. ఆయన ప్రస్తావించిన విషయాలపై త్వరలో పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి దీపాదాస్ మున్షి తో సమావేశమై చర్చించవచ్చని తెలిపారు.

ఇక, ప్రభుత్వ నిధుల కేటాయింపు విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలు అన్యాయం ఎదుర్కొంటున్నారని ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న నియోజకవర్గాలకు మాత్రమే నిధులు వెళ్ళిపోతున్నాయని, తమ నియోజకవర్గాలకు ఏం కేటాయించలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారంటూ వార్తలు వచ్చాయి.ఈ విషయంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి ఫోన్ చేసి ఈ సమావేశం కేవలం లంచ్ మీటింగ్ మాత్రమేనని ఆయనతో వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.

Related Posts
భారత అమ్ముల పొదిలోకి ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అణు జలాంతర్గామి..
union minister rajnath singh unveiled ssbn s4 nuclear submarine in visakha suri

న్యూఢిల్లీ: భారతదేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ సముద్ర తీరంలో అణుసామర్థ్యం కలిగిన నాలుగవ జలాంతర్గామి ఎస్ఎస్‌బీఎన్ Read more

భారత న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం? మాజీ సీజేఐ
dychandrachud

భారత న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం ఆరోపణలపై మాజీ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పందించారు. ఈ మేరకు ఆ ఆరోపణలు ఖండించారు. చట్టప్రకారమే తీర్పులు వెలువరించినట్లు చెప్పారు. Read more

హిమపాతంలో చిక్కుకున్న 50 మంది
హిమపాతంలో చిక్కుకున్న 50 మంది

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా లో భారీ హిమపాతం (Avalanche) సంభవించింది.ఈ ఘటనలో సుమారు 50 మందికిపైగా కార్మికులు మంచు గడ్డల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.ఇప్పటికే 10 మందిని Read more

జగిత్యాల జిల్లాలో పండుగుపూట విషాదం
subbaraju dies

దసరా పండగ వేళ హోంగార్డు ఇంట్లో విషాదం నెలకొన్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మెట్‌పల్లి పట్టణానికి చెందిన హోంగార్డు సుబ్బరాజు జగిత్యాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో Read more

Advertisements
×