IT searches in Hyderabad again

మరో సారి హైదరాబాద్‌లో ఐటీ సోదాలు..

హైదరాబాద్ : ఐటీ అధికారుల సోదాలు హైదరాబాద్ లో మరో సారి కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలే లక్ష్యంగా మరో సారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో ఏకకాలంలో 30 ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గురువారం వేకువజాము నుంచి ఈ ఐటీ సోదాలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జూబ్లీహిల్స్, రాయదుర్గం, చైతన్యపురి, మలక్ పేట, కొల్లూరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ తనిఖీలు కొనసాగిస్తున్నారు. అన్విత బిల్డర్స్, ప్రాపర్టీస్ కార్యాలయాలు, యాజమాన్యాల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి.

Advertisements

చైతన్యపురిలోని గూగీ ప్రాపర్టీస్ కార్యాలయంలోనూ సోదాలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత బొప్పరాజు శ్రీనివాస అచ్యుతరావు నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. మలక్‌పేట నియోజకవర్గ కాంగ్రెస్ నేత షేక్ అక్బర్ నివాసంలో, ఆయనకు చెందిన గూగి ప్రాపర్టీస్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు 40 బృందాలుగా రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలు దస్త్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో గత నెల 23వ తేదీన విస్తృతంగా ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Related Posts
తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టులో విచారణ.. ధర్మాసనం కీలక తీర్పు
supreme court appoints special sit for tirumala laddu probe

supreme-court-appoints-special-sit-for-tirumala-laddu-probe న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో Read more

పాలిటెక్నిక్ కాలేజీలో ప్రైవేట్ వీడియోల కలకలం
private videos at Polytechn

మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రైవేట్ వీడియోల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. బాలికల వాష్రూంలో మొబైల్ ఫోన్ ఉపయోగించి వీడియోలు రికార్డు చేస్తున్నట్లు విద్యార్థినులు గుర్తించడం Read more

Myanmar Earthquake: మయన్మార్ భూకంపం: 3,085కి చేరిన మృతుల సంఖ్య
మయన్మార్ భూకంపం: 3,085కి చేరిన మృతుల సంఖ్య

మయన్మార్‌లో ఒక వారం క్రితం సంభవించిన భారీ భూకంపంలో మరింతగా మృతుల సంఖ్య పెరిగాయి. ప్రస్తుతం మృతుల సంఖ్య 3,085కి చేరినట్లు సైనిక ప్రభుత్వం ప్రకటించింది. 7.7 Read more

50% రాయితీపై పెట్రోల్..ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
Petrol on 50% discount AP

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం ఉపాధి పొందుతున్న లేదా ప్రైవేట్ జాబ్ చేస్తున్న దివ్యాంగులకు 50% సబ్సిడీపై పెట్రోల్ మరియు డీజిల్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం దివ్యాంగుల Read more

×