ISS రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్... ఫొటోలు విడుదల

ISS: రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్… ఫొటోలు విడుదల

ఇక భూమిని రాత్రివేళ చూడడమంటేనే ఓ అద్భుతం ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి తీసిన రాత్రి దృశ్యాలు అయితే మనసు దోచేసేలా ఉంటాయి. తాజాగా ఐఎస్ఎస్ పంచిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నదేమిటంటే — నక్షత్రాల వెలుగు కింద వెలిగిపోతున్న మన భారతదేశం దృశ్యం!ఈ ఫొటోను చూసిన వాళ్లందరూ అబ్బురపడిపోతున్నారు. అంతరిక్షం నుంచి తీసిన దృశ్యంలో భారతదేశం ఓ స్వర్ణ పటముగా మెరుస్తూ కనిపిస్తోంది. కేవలం మన దేశమే కాదు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు కూడా ఈ ఫొటోలలో ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నాయి. మధ్య పశ్చిమ అమెరికాలోని మేఘావృత ప్రాంతం, ఆగ్నేయాసియాలోని తీరప్రాంతాలు, కెనడాలోని ఆకుపచ్చ వెలుగులు…

Advertisements
ISS రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్... ఫొటోలు విడుదల
ISS రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్… ఫొటోలు విడుదల

ఇవన్నీ ఫొటోల్లో ఒక కళాత్మక దృశ్యంలా నిలిచాయి.భూమి వక్రత కారణంగా, ఈ దృశ్యాల్లో ఆకాశం వంకరగా మలుపు తిప్పినట్టుగా ఉండటం ప్రత్యేక ఆకర్షణ. ఇది ఫొటోలను మరింత మాయాజాలంగా మార్చేస్తోంది. భూమి మీద వెలుగుతున్న నగరాల కాంతులు, అంతరిక్షంలో మెరిసే నక్షత్రాలు, భూమిని చుట్టేసిన వాతావరణ వెలుగు — ఇవన్నీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడమంటే ఓ అద్భుత కాంబినేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.‘నక్షత్రాలు, నగర కాంతులు, వాతావరణ తేజస్సు – అన్నీ ఒకే ఫ్రేమ్‌లో’ అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలు ఐఎస్ఎస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయబడ్డాయి. కాసేపులోనే ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

ISS రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్... ఫొటోలు విడుదల
ISS రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్… ఫొటోలు విడుదల

లక్షలాదిమంది లైక్ చేసి, షేర్ చేయడంతో పాటు, ఈ అద్భుత దృశ్యాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి 370 నుంచి 460 కిలోమీటర్ల మధ్య ఎత్తులో తిరుగుతుంది.అక్కడి నుంచి భూమి మీద రోజూ చాలా ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఐఎస్ఎస్ తరచూ అలాంటి ప్రత్యేక క్షణాలను చిత్రాల రూపంలో పంచుకుంటూ ఉంటుంది.ఇదివరకూ నాసాకు చెందిన వ్యోమగామి డొనాల్డ్ పెట్టిట్ భారతదేశంలో జరిగిన మహా కుంభమేళా దృశ్యాన్ని అంతరిక్షం నుంచి పంచిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆ ఫొటోలు కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.ఈ ఫొటోలు చూపించేది కేవలం భూమి అందమే కాదు. మనం నివసిస్తున్న ఈ గ్రహం ఎంత అపూర్వమైందో, ఎంత బంగారు ఖండమైందో కూడా తెలియజేస్తాయి. అంతరిక్షం నుంచి చూసిన దృశ్యాల్లో మన భారతదేశం ఓ ప్రకాశవంతమైన రత్నంలా మెరుస్తోంది.ఈ ఫొటోలు చూసిన ప్రతి ఒక్కరికి దేశభక్తి భావం పొంగిపొర్లకమానదు. మన దేశం ప్రపంచానికి చూపించే ప్రకాశం, శక్తి, అందం – ఇవన్నీ ఈ ఒక్క ఫొటోలో కనిపించేస్తాయి.

Read Also : America: 30 రోజులకు మించి అమెరికాలో ఉండేవారు రిజిస్టర్ చేసుకోవాలి:హోం శాఖ

Related Posts
సుప్రీం కోర్టు ఢిల్లీ వాయు కాలుష్యంపై ఆగ్రహం
supreme court india 2021

గత కొన్ని రోజులుగా ఢిల్లీ వాయు క్వాలిటీ సివియర్ ప్లస్ స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో, సుప్రీం కోర్టు నేడు ఢిల్లీ అధికారులు మరియు కాలుష్య నియంత్రణ Read more

పండుగ సీజన్ తో పాటు తెలంగాణ విక్రేతల అభివృద్ధికి కట్టుబడి ఉన్న అమెజాన్..
Amazon is committed to the development of Telangana sellers along with the festive season

విక్రేతల వ్యాపార వృద్ధిని పెంచడానికి బహుళ ఉత్పత్తి విభాగాలలో విక్రయ రుసుముల పరంగా గణనీయమైన తగ్గింపును ప్రకటించింది. Amazon.inలో విక్రయదారులు తమ ఉత్పత్తి ఎంపికను విస్తరించడంలో సహాయపడటానికి Read more

కోహ్లీని ‘రౌడీ’ అన్న జర్నలిస్ట్
కోహ్లీని 'రౌడీ' అన్న జర్నలిస్ట్

'నువ్వు రౌడీ తప్ప మరేమీ కాదు విరాట్' అన్న జర్నలిస్ట్ మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో ఆస్ట్రేలియన్ మహిళా జర్నలిస్ట్‌తో ఇటీవల జరిగిన వాదనపై భారత మాజీ కెప్టెన్ విరాట్ Read more

జామా మసీదు పై ఒవైసీ ఆగ్రహం
జామా మసీదు పై ఒవైసీ ఆగ్రహం

సంభాల్‌లో జామా మసీదు వద్ద నిర్మాణంలో ఉన్న కొత్త పోలీస్ అవుట్‌పోస్ట్‌పై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×