Israeli attacks on Gaza.. 59 people killed!

Israel-Hamas : గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు.. 59 మంది మృతి!

Israel-Hamas : ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా గాజా పై టెల్‌అవీవ్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో 50 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం సాగించింది. అయితే జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది.

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు

పరిస్థితులు మళ్లీ మొదటికే

ఈ సమయంలో ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. ఇటీవల ఈ ఒప్పందం గడువు ముగిసింది. అయితే ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇజ్రాయెల్ కోరింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటికే వచ్చాయి. కాల్పుల విరమణ ముగియడంతో సోమవారం ఇజ్రాయెల్ దళాలు… హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై భీకరమైన దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 44 మంది చనిపోయారు. అలాగే దక్షిణ సిరియాపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది.

ఇజ్రాయెల్ వైమానికి దాడులు

ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 19 మంది గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, దక్షిణ సిరియాలోని మిలటరీ కమాండ్ సెంటర్ లు, ఆయుధాలు, ఆర్మీ వాహనాలు ఉన్న స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానికి దాడులు చేస్తోంది. సిరియాను అసద్ పాలిస్తున్నప్పుడు ఈ స్థావరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మిలిటరీ ఆస్తులను సిరియా నూతన ప్రభుత్వ వర్గాల ఆధ్వర్యంలోని బలగాలు నిర్వహిస్తున్నాయి. వీటి నుంచి ఇప్పుడు తమకు ప్రమాదం పొంచి ఉందనే కారణంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.

Related Posts
పల్నాడులో హృదయ విదారక ఘటన
rat attack

పల్నాడు జిల్లాలో జరిగిన హృదయ విదారక ఘటన అందరినీ కలచివేసింది. నూజెండ్ల మండలం రవ్వారంలో నాలుగు నెలల చిన్నారిని పందికొక్కులు దాడి చేసి ప్రాణాలు తీసిన విషాద Read more

ప్రపంచం వాతావరణ మార్పు వల్ల వచ్చే వినాశానికి సిద్దంగా లేదు
465887 Guterres

ప్రపంచ దేశాలు వాతావరణ మార్పు వల్ల వచ్చే వినాశానికి ఇంకా సిద్దంగా లేవని ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని యూనైటెడ్ నేషన్స్ (UN) ప్రధాన కార్యదర్శి Read more

ఓటర్ల జాబితాను బీజేపీ మారుస్తుంది: కేజ్రీవాల్
ఓటర్ల జాబితాను బీజేపీ మారుస్తుంది: కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఓటర్ల జాబితాను మార్పు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. డిసెంబర్ Read more

మనీష్ సిసోడియా ఓటమి !
Manish Sisodia defeat!

న్యూఢిల్లీ : జంగ్పూరాలో మనీష్ సిసోడియాకు బిగ్ షాక్ తగిలింది. జంగ్పూరాలో మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ గెలిచారు. 600 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *