Israel : గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి తాజాగా గాజాలో హమాస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.హమాస్ సైనిక నిఘా విభాగానికి అధిపతిగా ఉన్న ఒసామా టబాష్ ను ఇజ్రాయెల్ తమ దాడుల్లో హతమార్చినట్లు అధికారికంగా ప్రకటించింది.దక్షిణ గాజాలో జరిగిన ఈ ఆపరేషన్ లో అతను ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ధృవీకరించింది.అయితే దీనిపై ఇప్పటివరకు హమాస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఒసామా టబాష్ ఎవరూ
హమాస్ లో కీలక నేతగా ఉన్న ఒసామా టబాష్, హమాస్ టార్గెటింగ్ యూనిట్ చీఫ్ గా పనిచేశాడు.అతని నేతృత్వంలో హమాస్ దళాలు ఇజ్రాయెల్ పై పలు దాడులు నిర్వహించాయి.హమాస్ వ్యూహాత్మకంగా చేపట్టే దాడులకు ప్రధాన సూత్రధారి ఆయనేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.ఇజ్రాయెల్, హమాస్ మధ్య మూడు రోజుల క్రితం సీజ్ఫైర్ ఒప్పందం ముగిసింది.అప్పటి నుంచి గాజా పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ముమ్మరంగా కొనసాగిస్తోంది.ఈ దాడులు హమాస్ లక్ష్యాలను కుదేలు చేయడానికేనని ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ తామే అంగీకరించని కారణంగా దాడులు మళ్లీ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించిన హమాస్
హమాస్ తాము బందీలను విడుదల చేయడానికి నిరాకరించిందని,అందువల్లే దాడులు మళ్లీ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించింది.అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ తిరస్కరించిందని తెలుస్తోంది.తాజా దాడిలో 85 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా అధికారులు ప్రకటించారు.మరణించినవారిలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారని తెలుస్తోంది.అంతకుముందు జరిగిన దాడుల్లో 400 మందికి పైగా గాజా పౌరులు మరణించినట్లు సమాచారం. హమాస్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతాయా లేక మళ్లీ సీజ్ఫైర్ కు అవకాశం ఉందా? అన్నది అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.హమాస్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూడాలి.