కోహ్లీ రాహుల్ కు గాయాలు అవ్వడం నిజమేనా.

కోహ్లీ రాహుల్ కు గాయాలు అవ్వడం నిజమేనా.

బీసీసీఐ ఇటీవల దేశవాళీ మ్యాచ్‌లు ఆడడాన్ని క్రికెటర్లకు తప్పనిసరి చేసింది.అయితే, గాయం కారణంగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ రంజీ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో ఆడకూడదని నిర్ణయించారు.ఈ సందర్భంలో, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఒక పెద్ద ప్రశ్న లేవనెత్తారు.బీసీసీఐ కొత్త నిబంధన ప్రకారం,క్రికెటర్లందరూ దేశవాళీ మ్యాచ్‌లు ఆడడం తప్పనిసరి.ఈ నిర్ణయం వల్ల రంజీ ట్రోఫీ 5వ రౌండ్‌లో పలు స్టార్ ప్లేయర్లు కనిపించారు.కానీ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లలో ఆడలేదు.కోహ్లీ, రాహుల్ గాయాల కారణంగా ఆడకూడదని నిర్ణయించుకున్నారు.అయితే, ఈ ఇద్దరూ సత్తా చాటేందుకు తదుపరి అంతర్జాతీయ టూర్‌లో ఆడబోతున్నారు.కోహ్లీ మెడ సమస్యతో, రాహుల్ మోచేయి గాయంతో రంజీ ట్రోఫీ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని బీసీసీఐకి వారు తెలియజేశారు.

కోహ్లీ రాహుల్ కు గాయాలు అవ్వడం నిజమేనా.
కోహ్లీ రాహుల్ కు గాయాలు అవ్వడం నిజమేనా.

కానీ, సునీల్ గవాస్కర్ ఈ విషయంలో సందేహాలు వ్యక్తం చేశారు.”గాయాల విషయంలో, మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించడం సులభం. నితీష్ రెడ్డి గాయంతో ఎన్సీఏకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు.ఈ గాయాలు నిజమేనా, లేదా సరికొత్త కారణాలపై ఆటగాళ్ల నిర్ణయాలు తీసుకున్నారో?” అంటూ గవాస్కర్ ప్రశ్నించారు.సునీల్ గవాస్కర్ బీసీసీఐకు కొన్ని సూచనలు ఇచ్చారు. “సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు గాయపడ్డప్పుడు వెంటనే ఎన్సీఏకి నివేదించాలి.ఎన్‌సీఏ నుండి ఫిట్‌గా ఉంటారని ధృవీకరణ పొందిన తర్వాత మాత్రమే జాతీయ జట్టులో ఆడాలి” అని తెలిపారు.ఇక,విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ 2024లో ఆడాలని నిర్ణయించుకున్నాడు.ఢిల్లీ జట్టు తరపున రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు.13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడబోతున్నాడు.మరోవైపు,కేఎల్ రాహుల్ కూడా రంజీ ట్రోఫీ 5వ రౌండ్‌లో ఆడే అవకాశముంది.కర్ణాటక జట్టులో అతని పేరు చేర్చారు. బెంగళూరులో కర్ణాటక జట్టు హర్యానాతో తలపడనుంది.

Related Posts
రోహిత్ శర్మ ఔట్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా ఎవరంటే?
రోహిత్ శర్మ ఔట్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా ఎవరంటే?

2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, టీమిండియా ఇంగ్లండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇలాంటి Read more

ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు ప్రకటన పై ఆలస్యం..కారణం
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు ప్రకటన పై ఆలస్యం..కారణం

పాకిస్థాన్, యూఏఈ వేదికగా వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి 8 జట్లలో ఇప్పటి వరకు 7 జట్లు తమ జట్టును ప్రకటించాయి. అయితే, పాకిస్థాన్ Read more

ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే..

ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్ మరోసారి తన సూపర్ ఫామ్‌ను ప్రదర్శించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 9వ మ్యాచ్‌లో హేల్స్ అద్భుత సెంచరీతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని Read more

న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా
ind vs nz 3rd test 1200 1730621025

న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్‌ను 0-3తో కోల్పోవడంతో టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో దిగజారింది. ముంబైలో జరిగిన చివరి టెస్టులో కివీస్ జట్టు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *