Iron feet should be imposed on illegal mining.. Revanth Reddy

అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలి : రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) నుంచే ఇసుక సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఖనిజాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Advertisements
అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక

నిర్మాణరంగ సంస్థలకు అవసరమైన ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలి. సరైన ధరలకు సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదు. హైదరాబాద్‌ నగరానికి మూడు వైపులా స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలి. క్వారీలకు జరిమానాలపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. మైనర్‌ ఖనిజాల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలి అని సీఎం ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.

ఇసుక అక్రమ రవాణకు అడ్డుకట్ట

ఇసుక బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణకు అడ్డుకట్ట వేసే బాధ్యత జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలకు హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రాకు అప్పగించారు. ఇసుక రీచ్‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్ తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్​లు ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

Related Posts
Narayana: అమరావతిలో మళ్లీ భూసేకరణకు మంత్రి నారాయణ వివరణ
Narayana: అమరావతిలో మళ్లీ భూసేకరణకు మంత్రి నారాయణ వివరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసే ప్రణాళికలు ఒక గొప్ప సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావచ్చినా, రాజధాని అమరావతిలో Read more

గేమ్ ఛేంజర్ విడుదలకు ముందే ₹200 కోట్లు ఆదాయం
గేమ్ ఛేంజర్ విడుదలకు ముందే ₹200 కోట్లు ఆదాయం

గేమ్ ఛేంజర్ విడుదలకు ముందు నాన్-థియేట్రికల్ ఆదాయంలో ₹200 కోట్లు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం గేమ్ ఛేంజర్ జనవరి 10, 2025న థియేటర్‌లలో విడుదల కానుంది. Read more

ఢిల్లీ ఎన్నికల నిర్వహణకు ఏఐ చాట్‌బోట్లు!
ఢిల్లీ ఎన్నికల నిర్వహణకు ఏఐ చాట్ బోట్లు!

ఢిల్లీ పోలీసులు 'చునవ్ మిత్ర' మరియు 'సైబర్ సారథి' అనే రెండు ఏఐ ఆధారిత చాట్‌బోట్లను ప్రవేశపెట్టి, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను క్రమబద్ధీకరించడమే కాకుండా, ఎన్నికల సమయంలో Read more

యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి
యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి

కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్‌గా ఎదిగిన యష్, తన పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో అభిమానులంతా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి, 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా Read more

Advertisements
×