हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

IRCTC : తిరుపతి-షిర్డీ మధ్య 18 స్పెషల్‌ రైళ్లు.. భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త

Sudha
IRCTC : తిరుపతి-షిర్డీ మధ్య 18 స్పెషల్‌ రైళ్లు.. భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త

భక్తులకు ఐఆర్‌సీటీసీ ( IRCTC) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుపతి మరియు షిర్డీ మధ్య 18 ప్రత్యేక రైలు సర్వీసులు (Special Trains) నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 29 వరకు ఈ రైల్వే సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఐఆర్‌సీటీసీ (IRCTC) తెలిపింది.ఈ నిర్ణయం ద్వారా భక్తులు తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతంగా తమ యాత్రను కొనసాగించవచ్చు.

 IRCTC :  తిరుపతి-షిర్డీ మధ్య 18 స్పెషల్‌ రైళ్లు.. భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త
IRCTC : తిరుపతి-షిర్డీ మధ్య 18 స్పెషల్‌ రైళ్లు.. భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త

ప్రతి ఆదివారం ఉదయం 4 గంటలకు తిరుపతి నుంచి తిరుపతి-సాయినగర్‌ షిర్డీ రైలు (07637) బయల్దేరి, మరుసటి రోజు ఉదయం10.45 గంటలకు షిర్డీ చేరుకోనుంది. ప్రతి సోమవారం రాత్రి 7.35 గంటలకు షిర్డీ-తిరుపతి రైలు (07638) బయల్దేరి, మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది. ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 29 వరకు ప్రతి వారం ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌, లింగంపల్లి, వికారాబాద్‌, జహీరాబాద్‌, బీదర్‌, బాల్కి, ఉద్గిర్‌, లాతూర్‌ రోడ్డు, పర్లి, గంగఖేర్‌, పర్బని, సేలు, జాల్నా, ఔరంగాబాద్‌, నాగర్‌సోల్‌, మన్‌మడ్‌, కోపర్‌గావ్‌ స్టేషన్లలో ఆగనుంది.

ఐఆర్సిటిసిలో అతిపెద్ద వాటాదారు ఎవరు?

IRCTC యొక్క అగ్ర వాటాదారులలో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు, ఆయనకు 62.4% వాటాతో అతిపెద్ద వాటా ఉంది. ఆ తరువాత, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 10.04% వాటాతో అత్యధిక పబ్లిక్ వాటాదారు.

ఐఆర్సిటిసి లాభదాయకమైనదా?

IRCTC FY25 ను రూ. 4,674 కోట్ల ఆదాయంతో ముగించింది, గత సంవత్సరంతో పోలిస్తే ~10% వృద్ధి చెందింది మరియు రూ. 1,314 కోట్ల నికర లాభం దాదాపు 19% పెరిగి ఉంది. EBITDA మార్జిన్లు 33%, దీర్ఘకాలిక రుణం లేదు మరియు దాదాపు రూ. 2,000 కోట్ల నగదు నిల్వలతో, IRCTC బలమైన కార్యాచరణ స్థితిలో ఉంది .

భారతీయ రైల్వేలో ఎన్ని డిఆర్ఎంలు ఉన్నారు?

భారతీయ రైల్వేలు 18 పరిపాలనా మండలాలుగా (17 కార్యాచరణ మండలాలు) విభజించబడ్డాయి, వీటికి జనరల్ మేనేజర్లు నాయకత్వం వహిస్తారు, వీటిని డివిజనల్ రైల్వే మేనేజర్లు (DRM) నేతృత్వంలో 68 ఆపరేటింగ్ విభాగాలుగా విభజించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Srinivas Goud: ఆగస్టు 7న గోవాలో జాతీయ ఒబిసి మహాసభ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870