IPL 2025 : మరో రెండ్రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం రెండు నెలల పాటు క్రికెట్ మోజులో మునిగిపోవాల్సిన సమయం వచ్చేసింది.ఐపీఎల్ 18వ సీజన్ మరో రెండు రోజుల్లో గ్రాండ్గా ప్రారంభం కాబోతోంది.ఈసారి టోర్నమెంట్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభమై మే 25న ఫైనల్తో ముగియనుంది.పది జట్లు ట్రోఫీ కోసం పోటీ పడబోతున్నాయి.మునుపటి సీజన్లతో పోలిస్తే,ఈసారి మరింత ఆసక్తికరమైన సమీకరణాలు కనిపిస్తున్నాయి.ఐపీఎల్ 2025 షురూ కావడానికి ముందు అన్ని జట్ల కెప్టెన్లతో ప్రత్యేక ఫొటోషూట్ నిర్వహించారు.ఈ ఫొటోషూట్లో ప్రతి జట్టు కెప్టెన్ స్టైలిష్ లుక్తో ఫోజులిచ్చారు.ఇందులో పాల్గొన్న కెప్టెన్లు.

కోల్కతా నైట్ రైడర్స్ – శ్రేయాస్ అయ్యర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రజత్ పటిదార్
రాజస్థాన్ రాయల్స్ – సంజూ శాంసన్
సన్రైజర్స్ హైదరాబాద్ – పాట్ కమిన్స్
పంజాబ్ కింగ్స్ – అజింక్యా రహానే
గుజరాత్ టైటాన్స్ – శుభ్ మన్ గిల్
ముంబయి ఇండియన్స్ – హార్దిక్ పాండ్యా
ఢిల్లీ క్యాపిటల్స్ – రిషబ్ పంత్
చెన్నై సూపర్ కింగ్స్ – రుతురాజ్ గైక్వాడ్
లక్నో సూపర్ జెయింట్స్ – అక్షర్ పటేల్
ఈ ఫొటోషూట్లో ప్రతి కెప్టెన్ తన ప్రత్యేకమైన స్టైల్తో ఆకట్టుకున్నారు.
ఒక్క సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రమే విదేశీ కెప్టెన్
ఐపీఎల్ 2025లో ఒక్క సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకే విదేశీ కెప్టెన్ ఉన్నాడు.మిగతా తొమ్మిది జట్లకు భారత ఆటగాళ్లే నాయకత్వం వహిస్తున్నారు.ఆసీస్ స్టార్ క్రికెటర్ పాట్ కమిన్స్ హైదరాబాద్ జట్టును నడిపించనున్నాడు.ఇతర జట్లన్నీ భారత యువతారలనే కెప్టెన్లుగా ఎంపిక చేశాయి.ప్రతి జట్టూ స్వతంత్ర శైలిలో సత్తా చాటడానికి సిద్ధమవుతోంది.కొన్ని జట్లు బలమైన స్క్వాడ్తో విజయ దారిలో ముందుకెళ్లాలని చూస్తుంటే, మరికొన్ని జట్లు యువ ప్రతిభతో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి.ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరి ఖాతాలో పడబోతోందో చూడాలి!