हिन्दी | Epaper
నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం?

IPL : 2025లో ఖరీదైన ఆటగాళ్ల ఫెయిల్యూర్ షాక్

Digital
IPL : 2025లో ఖరీదైన ఆటగాళ్ల ఫెయిల్యూర్ షాక్

IPL : కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన స్టార్ ప్లేయర్ల ఫెయిల్యూర్ – ఫ్యాన్స్‌లో తీవ్ర నిరాశ

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. అయితే ఆటలో ప్రతిభ చూపించాలన్న ఆశతో కోట్ల రూపాయలు వెచ్చించి తీసుకున్న కొంతమంది స్టార్ క్రికెటర్లు మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచారు. ఎక్కువ ధరకు కొనుగోలు చేసినప్పటికీ వారి ప్రదర్శన నిలకడగా లేకపోవడం ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారింది.ఈ జాబితాలో ముందుగా రిషబ్ పంత్ పేరును చెప్పాల్సిందే. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.27 కోట్ల భారీ ధరతో పంత్‌ను కొనుగోలు చేసింది. అయితే ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్లలో కేవలం 17.17 సగటుతో 103 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 100 మాత్రమే. చెన్నైపై 63 పరుగులు చేసినా, ఆ మ్యాచ్‌లో జట్టు ఓడిపోవడం వల్ల అతని ఇన్నింగ్స్ కీలకంగా నిలవలేదు. కెప్టెన్సీలోనూ పంత్ అనూహ్యమైన నిర్ణయాలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.మరోవైపు గ్లెన్ మాక్స్వెల్‌ కూడా ఈ సీజన్‌లో తన స్టామినా చూపలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ జట్టు రూ.4.2 కోట్లకు అతన్ని కొనుగోలు చేసినా, ఇప్పటివరకు కేవలం 41 పరుగులే చేశాడు. అతని తరహాలో లాంగ్ షాట్లు కొట్టే ఆటగాడిగా పేరున్నప్పటికీ, ఈ సీజన్‌లో కేవలం 4 ఫోర్లు, ఒకే ఒక సిక్సర్‌తో నిరాశపరిచాడు.

 IPL : 2025లో ఖరీదైన ఆటగాళ్ల ఫెయిల్యూర్ షాక్
IPL : 2025లో ఖరీదైన ఆటగాళ్ల ఫెయిల్యూర్ షాక్

అంచనాలు తలకిందులుచేసిన ఖరీదైన ఆటగాళ్లు

ఇంకొక నిరాశజనక ప్రదర్శన చూపించిన ఆటగాడు వెంకటేష్ అయ్యర్. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసిన ఈ ఆటగాడు, 7 మ్యాచ్లలో కేవలం 121 పరుగులే చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌లో 60 పరుగులు చేయడంతో పాటు మెరుపు ప్రదర్శన ఇచ్చినా, మిగతా మ్యాచ్లలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.మార్కస్ స్టోయినిస్ విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ అతన్ని రూ.11 కోట్లకు కొనుగోలు చేసినా, 6 మ్యాచ్లలో కేవలం 66 పరుగులే చేయగలిగాడు. బౌలింగ్‌లోనూ పూర్తి విఫలం – ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీసకపోవడం ఫ్రాంచైజీకి మింగుడుపడని విషయంగా మారింది.ఈ సీజన్‌లో అంచనాలు పెట్టిన ఖరీదైన ఆటగాళ్లు ఫెయిలవడాన్ని చూసి అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు వెచ్చించగా, ఫలితం మాత్రం పెద్దగా కనబడకపోవడం ఇప్పటి ఐపీఎల్ 2025లో చర్చనీయాంశంగా మారింది.

Read More : IPL 2025: ధోనీ కాళ్లు మొక్కిన వైభవ్ సూర్యవంశీ!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870