అది సింగపూర్(Singapore)లోని తోవా పాయో ప్రాంతం. 71 ఏళ్ల షణ్ముగంనాథన్ షమ్లా అనే బామ్మ కనిపిస్తే చాలు.. ఆకాశం నుండి వందలాది పావురాలు ఒక్కసారిగా కిందకు దిగుతాయి. ఆ దృశ్యం చూడటానికి ఏదో సినిమాలో సీన్ లాగా చాలా అందంగా ఉంటుంది. కానీ, ఆమె పక్షులపై చూపించే ఆ అమితమైన ప్రేమే ఇప్పుడు ఆమెను కోర్టు మెట్లు ఎక్కించి, ఏకంగా రూ. 2,27,845 జరిమానా కట్టేలా చేసింది. సింగపూర్ వన్యప్రాణి చట్టం ప్రకారం అడవి పక్షులకు ఆహారం పెట్టడం తీవ్రమైన నేరం. షమ్లా బామ్మకు ఈ విషయం తెలియనిదేమీ కాదు. గత ఏడాది మే నెలలోనే ఇదే నేరానికి ఆమెకు రూ.85,000 జరిమానా పడింది. అప్పట్లో ఇంకెప్పుడూ ఇలా చేయను అని కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ, ఆమె మనసులోని పక్షుల ప్రేమ ఆ హామీని ఎంతో కాలం నిలవనీయలేదు. కేవలం నెల రోజుల్లోనే మళ్ళీ తన పాత అలవాటును మొదలుపెట్టింది.
Read Also: Mythology: చంద్రుడిని మామ అని ఎందుకు అంటారో తెలుసా ?

బామ్మ నిర్లక్ష్యానికి పరాకాష్టగా
” జూలై 2025 నుంచి జనవరి 2026 మధ్య కాలంలో ఆమె ఏకంగా తొమ్మిది సార్లు పక్షులకు ధాన్యం, రొట్టె ముక్కలు వేస్తూ పట్టుబడ్డారు. కోర్టులో ప్రాసిక్యూటర్లు సమర్పించిన వీడియో ఫుటేజ్లో.. ఆమె చుట్టూ పక్షుల గుంపులు ముసిరి ఉండటం స్పష్టంగా కనిపించింది. ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి ఆమె తన ఏరియా ఎంపీని కూడా కలిశారు. కానీ, ఎంపీని కలిసిన మూడు రోజులకే మళ్ళీ పక్షులకు మేత వేస్తూ అధికారులకు చిక్కడం ఆమె నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. న్యాయమూర్తి ముందు షమ్లా బామ్మ తనకు ఉద్యోగం లేదని, ఇన్సూరెన్స్ లేదని మొరపెట్టుకున్నారు. తక్కువ జరిమానా విధించాలని, కావాలంటే సమాజ సేవ చేస్తానని చెప్పారు. అయితే, ఆమె పదే పదే చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పునరావృత నేరస్థురాలు కావడంతో న్యాయస్థానం కఠినంగా వ్యవహరించింది. రూ.2.27 లక్షల భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: