అమెరికా (USA) వీసాలపై ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రోజుకో నిర్ణయాన్ని ప్రకటిస్తూ, అటు ఉద్యోగులను, ఇటు విద్యార్థులను ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు తట్టాబుట్టా పట్టుకుని స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇక ఉద్యోగులను కూడా భారీగా లేఆఫ్ లు ప్రకటిస్తుండడంతో అమెరికా కంటే స్వదేశమే మేలని వెనుతిరిగి వస్తున్నారు. అయితే ఇటీవలే ట్రంప్ తన తప్పును బహిరంగంగా ఒప్పుకున్నారు.
తమకు నైపుణ్యం గల ఉద్యోగులు అవసరమని, తమ దేశం ముందుకు వెళ్లాలి అంటే వారి ప్రతిభ తమకు కావాలని అన్నారు. తమ దేశంలో ప్రతిభావంతులు లేరని పేర్కొన్నారు. దీనిపై అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకే హెచ్-1బీ ఉద్యోగులు అని అన్నారు. శిక్షణ ఇచ్చిన తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలని అన్నారు. ఇదే వీసా విషయంలో ట్రంప్ కొత్త విధానమని వెల్లడించారు.
Read Also: Telangana SSC: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు!

విదేశీ కార్మికులపై ఆధారపడవద్దు..
విదేశీ కార్మికులపై దీర్ఘకాలికంగా ఆధారపడకుండా ఉండాలి. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు పొందేలా అమెరికన్లకు శిక్షణ ఇవ్వాలి. అందుకోసం నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను తాత్కాలికంగా అమెరికాకు తీసుకురావడమే ఈ కొత్త విధానం. అమెరికాలో తయారీ రంగాన్ని పునరుద్ధరించేందుకు నాలెడ్జ్ ట్రాన్స్ ఫర్ కోసం చేస్తోన ప్రయత్నమే ఇది. రాత్రికి రాత్రే నౌకల్లో వస్తువులు ఎగుమతి అవుతాయని మేం చెప్పడం లేదు. సెమీకండక్టర్ పరిశ్రమను అమెరికాకు తీసుకురావాలని అనుకుంటున్నాం.
ఆరిజోనాలో అందుకు తగిన సౌకర్యాలు ఉంటాయి. అందుకే అమెరికా కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి కొన్నేళ్ల కోసం విదేశీ శ్రామికశక్తిని రప్పించడమే అధ్యక్షుడి ఉద్దేశం అని భావిస్తున్నాను. తర్వాత వారు ఇంటికి వెళ్లొచ్చు. ఆ తరువాతే అమెరికా కార్మికులు బాధ్యత స్వీకరిస్తారు’ అని స్కాట్ బెసేంట్ అన్నారు.
మరోవైపు తాము వీసా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని హోమ్లాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టి నోయమ్ పేర్కొన్నారు. అమెరికాకు వచ్చే వ్యక్తులు ఉగ్రవాదులకు, అమెరికాను ద్వేషించే సంస్థలకు మద్దతుదారులు కాదని నిర్ధారించుకోవాలని అన్నారు. అందుకోసమే వెట్టింగ్ ను కొనసాగిస్తామని చెప్పారు. మా ప్రభుత్వం ఇమిగ్రేషన్ విధానాల ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తోందని తెలిపారు. అంతేకాకుండా అమెరికాకు వచ్చి ఉంటున్న వ్యక్తులు సరైన కారణాల వల్ల ఇక్కడ ఉంటున్నారని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటామని వెల్లడించారు. ట్రంప్ పాలనలో విదేశాల్లో జన్మించిన పౌరులు కూడా పౌరసత్వం పొందుతున్నారని పేర్కొన్నారు. ఆ మెరికాలోని తమ శ్రామిక శక్తిలో కీలక స్థానాలను భర్తీ చేయడానికి ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అవసరమని ట్రంప్ అన్నారు.తమవద్ద అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని అంగీకరించారు. అయితే అమెరికాకు చెందిన ఉద్యోగులు బయట నుంచి వచ్చే వారి దగ్గర నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: