ఆమె ఎన్నో కలలు కన్నది. భవిష్యత్తుపై ఉన్నతమైన ఆశయంతో ఉంది. అందుకు కష్టపడి చదివింది. ఉన్నత విద్యకోసం అమెరికా(USA)కు వెళ్లింది. చక్కగా చదువుకుని, ఉద్యోగాన్ని పొందింది. పనిలో ఆమె నైపుణ్యానికి తగిన గుర్తింపే కాదు.. అందుకు అవార్డులు కూడా పొందింది. కెరీర్ లో ఎంతో సక్సెస్ గా దూసుకెళ్తున్న తరుణంలో ఓ దుర్మార్గుడి వల్ల అనంతలోకానికి వెళ్లింది. ఇటీవల అమెరికాలో హత్యకు గురైన నిఖిత గొడిశాల(27) కేసులో పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి.
Read also: Bangladesh: బంగ్లాలో ఆగని దాడులు.. మరో హిందూ హత్య?

బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఆనంద్ కుమార్తె నిఖిత గొడిశాల ఎంఎస్ చదివేందుకు నాలుగేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. మేరీలాండ్ లోని కొలంబియా(Colombia)లో చదువుతూ అక్కడే ఉద్యోగం చేసేవారు. డిసెంబరు 31న కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి న్యూఇయర్ విషెస్ తెలిపారు. అనంతరం ఆమె ఫోన్ కలవలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసి, ఇండియాకు వచ్చిన నిందితుడు కాగా నిఖిత కనిపించడం లేదంటూ ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఇండియాకు వచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు జనవరి 3వ తేదీన అతని అపార్టుమెంట్ లో పరిశీలించగా నిఖిత మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే డిసెంబరు 31వ తేదీ రాత్రి 7గంటల తర్వాత నిఖితను అర్జున్ శర్మ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వెంటనే అమెరికా పోలీసులు ఇంటర్ పోల్ ద్వారా తమిళనాడు పోలీసులను సంప్రదించగా అతడిని తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. నిఖిత మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. కాగా అర్జున్ రెడ్డి నిఖితకు రూమ్మేట్ మాత్రమేనని, బాయ్ ఫ్రెండ్ కాదని ఆమె తండ్రి ఆనంద్ వివరణ ఇచ్చారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: