భారత్–అమెరికా(US) మధ్య ట్రేడ్ డీల్ త్వరలోనే కుదరొచ్చని అమెరికా నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డైరెక్టర్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందం దిశగా రెండు దేశాలు మళ్లీ అడుగు వేయడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి? అమెరికా భారత ఆర్థిక శక్తిని తక్కువ అంచనా వేసిందా? అనేదానిపై ఇప్పుడు ఓసారి పరిశీలిద్దాం. అమెరికా ఊహించినదానికంటే భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా నిలిచింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన టారిఫ్లు భారత ఎగుమతులను గణనీయంగా దెబ్బతీయలేపోయినా, అవి అమెరికా మార్కెట్పైనా ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.
Read Also: Chittur: AP ప్రజలకు శుభవార్త.. జనవరి నుంచి సంజీవని పథకం అమలు
పలు నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడి, అక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ సుంకాల ప్రభావం కొంతమేర భారత్పైనా పడింది. ఈ పరిస్థితుల్లో రెండు దేశాలు మళ్లీ వాణిజ్య సహకారం వైపు కదిలాయి.

ట్రంప్ సుంకాలు అమల్లోకి వచ్చిన తొలి నెల
అమెరికా భారతీయ దిగుమతులపై 50% వరకు టారిఫ్లు విధించినప్పటికీ, ఆశించినంతగా భారత ఎగుమతులు తగ్గలేదు. ట్రంప్ సుంకాలు అమల్లోకి వచ్చిన తొలి నెల సెప్టెంబర్లో 12% తగ్గుదల కనిపించినా, అక్టోబర్లో మాత్రం తగ్గుదల 8.6%కే పరిమితమైంది. జపాన్, దక్షిణ కొరియా వంటి పలుదేశాలు ఇప్పటికే అమెరికాతో సుంకాలు తగ్గించే ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, భారత్ మాత్రం “వెయిట్ & సీ”(Wait & See) వ్యూహాన్ని అనుసరించింది. వస్త్ర రంగం వంటి కొన్ని విభాగాలు ప్రభావితమయ్యినా, మొత్తం ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉందని అధికారులు తెలిపారు.
భారత్ అనుసరించిన ఈ వ్యూహం ఫలించింది అనిపిస్తోంది. రష్యా చమురు దిగుమతులపై విధించిన 25% సుంకాలను అమెరికా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం టారిఫ్లు 15% వరకు తగ్గవచ్చని సమాచారం. దీనికితోడు, వ్యవసాయం వంటి సున్నిత రంగాలకు రక్షణ కల్పిస్తూ, సుమారు 80% వస్తువులపై దిగుమతి సుంకాలు తగ్గించేందుకు భారత్ కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: