అమెరికాలో హెచ్1బీ వీసాతో(US Immigration) ఉద్యోగాలకు వెళ్లాలనుకునే భారతీయులకు మరో నిరాశ ఎదురైంది. భారత్లో నిర్వహించాల్సిన హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో, ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఫలితంగా దరఖాస్తుదారులు మరో ఏడాది వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: US: అమెరికాకు ఇరాన్ గార్డ్ కమాండర్ హెచ్చరిక

ట్రంప్ ప్రభుత్వ విధాన మార్పుల ప్రభావం
గతేడాది డిసెంబర్లో హెచ్1బీ వీసా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. దీనితో పాటు దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలపై కఠిన తనిఖీలు చేపట్టింది. ఈ మార్పుల కారణంగా భారత్లోని అమెరికా ఎంబసీల్లో జరగాల్సిన హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలు ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి.
పెండింగ్ దరఖాస్తులే కారణం
కొత్త విధానాలు, సోషల్ మీడియా వెట్టింగ్ కారణంగా గతేడాది దరఖాస్తు చేసిన అనేక మందికి ఇంకా ఇంటర్వ్యూలు పూర్తికాలేదు. ఈ పెండింగ్ ప్రక్రియ(US Immigration) ముగిసిన తర్వాతే కొత్త దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ స్లాట్లు కేటాయించే అవకాశం ఉంటుంది. దీంతో భారత్లో హెచ్1బీ ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది ఏప్రిల్–మే నెలల వరకు వాయిదా వేయాలని అమెరికా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
18 నెలల వరకు ఆలస్యం
ప్రస్తుతం ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా కేంద్రాల్లో హెచ్1బీ వీసా ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో మొత్తం ప్రక్రియను దాదాపు 18 నెలల వరకు వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
భారత్కు రావొద్దని హెచ్చరిక
ఇప్పటికే అమెరికాలో ఉన్న హెచ్1బీ ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్కు వెళ్లవద్దని వారి కంపెనీలు సూచిస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్ నిపుణులు కూడా ఇదే సలహా ఇస్తూ, భారత్కు వచ్చిన కొందరి స్టాంపింగ్ ఇంటర్వ్యూలు రద్దైన ఉదాహరణలను గుర్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: