हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump-పంట అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో అమెరికా రైతులు

Vanipushpa
Latest Telugu News: Trump-పంట అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో అమెరికా రైతులు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన సుంకాలు అమెరికా రైతులకు తీవ్ర సంక్షోభాన్ని మిగిలుస్తున్నాయి. సోయాబీన్, మొక్కజొన్న(Soyabeans, Corn) రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. డోనాల్డ్ ట్రంప్ పాలనలో సుంకాల ప్రభావం, వాణిజ్య యుద్ధం రెండు పంటలకు పెనుముప్పుగా మారుతున్నాయి. చైనా అమెరికా(China-America) సోయాబీన్ కొనుగోళ్లను నిలిపివేయడం వల్ల అమెరికా రైతులు దశాబ్దాల‌లో అత్యంత సంక్లిష్టమైన మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సాపేక్షంగా గత సంవత్సరం US సుమారు 24.5 బిలియన్ డాలర్ల విలువైన సోయాబీన్ ఎగుమతులు చేసింది. అయితే అందులో చైనా 12.5 డాలర్ల బిలియన్ల విలువై ఉత్పత్తిని కొనుగోలు చేసింది. అయితే ఈ సంవత్సరం చైనా ఆ కొనుగోళ్లను ఆపేయడంతో అమెరికన్ రైతులు తమ పంటను అమ్మే మార్గం లేకపోయింది. దీని కారణంగా వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

పరిశ్రమకు ఒక పెద్ద హెచ్చరిక
మే నెలలో.. ట్రంప్ ప్రభుత్వంలోని భారీ సుంకాలు చైనా దిగుమతులపై విధించబడ్డాయి. దీనికి ప్రతిస్పందనగా చైనా.. అమెరికన్ సోయాబీన్, మొక్కజొన్న పై 34 శాతం సుంకాన్ని విధించి కొనుగోళ్లు నిలిపివేయడం ద్వారా ప్రతీకారం తీర్చింది. అమెరికన్ సోయాబీన్ అసోసియేషన్ చీఫ్ కాలేబ్ రాగ్లాండ్ మాట్లాడుతూ.. ఇది పరిశ్రమకు ఒక పెద్ద హెచ్చరిక అని అన్నారు. ఈ పరిస్థితి అమెరికా రైతులకు నష్టాలు, పంట నిల్వ సమస్యలు, మార్కెట్ లభ్యత పరిమితులతో పాటు, అమెరికా లో రాజకీయ ఉద్రిక్తతలను కూడా పెంచింది.

Trump-పంట అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో అమెరికా రైతులు
Trump-పంట అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో అమెరికా రైతులు

పెరుగుతున్న రైతుల ఆందోళనలు

అక్కడ రైతుల ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెరికన్ సోయాబీన్ ఎగుమతి మండలి CEO జిమ్ సుట్టర్ మాట్లాడుతూ.. మే, సెప్టెంబర్ మధ్య నాలుగు రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, ఎటువంటి ఒప్పందం కుదరలేదు. సమయం ముగిసిపోతోందని నేను ఆందోళన చెందుతున్నాను. ట్రంప్, అవసరమైతే తాత్కాలిక ఉపశమన ప్యాకేజీని పరిశీలిస్తున్నారని ప్రకటించినప్పటికీ, రైతులు దీన్ని పూర్తిగా పరిష్కారం అనుకోవడం లేదు.ఇప్పటి పరిస్థితి చైనా వ్యూహంపై ఆధారపడింది కాబట్టి అమెరికా మొదటి అడుగు వేయాలని తెలిపారు. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హీ యాడోంగ్ ప్రకారం.. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడానికి అమెరికా అన్యాయమైన సుంకాలను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి ఉత్పత్తులు, సముద్ర ఆహార ఎగుమతులు చైనా ప్రతీకార సుంకాల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నిపుణుల ప్రకారం.. భారతదేశం, చైనా తమ స్థిరమైన వాణిజ్య విధానాలను కొనసాగిస్తే, అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు ఉండరు. ఈ పరిస్థితి కొనసాగితే, ట్రంప్ కూడా నిర్ణయాలను మళ్ళీ పునర్విచారించవలసి వస్తుందని సూచిస్తున్నారు.

అమెరికా సెనేట్‌లో వేడేక్కిన రైతుల సమస్యలు

ఇక అమెరికా సెనేట్‌లో కూడా రైతుల సమస్యలు వేడెక్కాయి. సౌత్ డకోటా రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ సంక్షోభం ప్రధాన చర్చ అంశంగా నిలిచిందని NBC మీట్ ది ప్రెస్‌లో సెనేట్ నాయకుడు జాన్ థూన్ పేర్కొన్నారు. చైనా 34 శాతం సుంకాన్ని అమలు చేసి.. అమెరికన్ సోయాబీన్ కొనుగోళ్లను ఆపడం వల్ల రైతులు అధిక పంట నిల్వ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. భారతదేశం కూడా యుఎస్ కు ప్రత్యామ్నాయ మార్కెట్‌గా గుర్తించబడింది. అయితే విభిన్న వ్యూహాలతో స్థిరంగా ఉండటం ట్రంప్ ప్రయత్నాలను విఫలపరిచింది. భారతదేశంలో సోయాబీన్, మొక్కజొన్నపై సుంకాలు అధికంగా ఉంటాయి. (మొక్కజొన్న 45%, సోయాబీన్ 60%). అలాగే కొన్ని అమెరికన్ సోయాబీన్ రకాల దిగుమతిని నిషేధించింది. సోయా నూనె, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కోసం భారత్ ఇప్పటికే అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్ వంటి దేశాలపై ఆధారపడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870