వాయువ్య తుర్కియేలో జరిగిన భారీ భూకంపం (Turkey Earthquake) మరోసారి ప్రకృతి ప్రబలతను గుర్తు చేసింది. ఆదివారం సాయంత్రం సంభవించిన ఈ భూమి కంపనల కారణంగా భయాందోళనలు నెలకొన్నాయి. మానవ నష్టం మరియు ఆస్తి ధ్వంసం దేశాన్ని ఒక్కసారిగా అలజడి లోకి నెట్టేసింది.

రాత్రి సమయంలో భూకంపం – భయాందోళనలతో ప్రజలు రోడ్లపైకి
తుర్కియే (Turkey Earthquake) విపత్తు నిర్వహణ సంస్థ (AFAD) అందించిన సమాచారం ప్రకారం, ఆదివారం రాత్రి 7:53 గంటలకు భూకంపం సంభవించింది. బలికేసిర్ ప్రావిన్స్లో భూ ఉపరితలానికి కేవలం 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఈ కారణంగా ప్రకంపనలు గట్టిగా అనిపించాయి. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) భూకంప తీవ్రతను 6.19గా నమోదు చేసింది. ఇస్తాంబుల్ (Istanbul) తో పాటు పలువురు ప్రావిన్సుల్లో ప్రకంపనలు తీవ్రంగా అనిపించడంతో ప్రజలు అప్రమత్తంగా తలుపులు తెరిచి బయటకు పరుగులు తీశారు.
16 భవనాలు కూలిపోగా – వృద్ధుడి మృతి, పలువురు గాయపాటు
ఈ ప్రకృతి విపత్తులో 16 భవనాలు పూర్తిగా కుప్పకూలినట్లు (buildings seem collapsed)తుర్కియే అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ యెర్లికాయ తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న 81 ఏళ్ల వృద్ధుడిని సహాయక సిబ్బంది బయటకు తీసినప్పటికీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు. ఇంకా 29 మంది గాయపడ్డారు, వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మిగిలిన శిథిలాల్లో ఎవరైనా చిక్కుకుపోయారా అనే అంశంపై పరిశీలన జరుగుతోంది.
సహాయ చర్యలు పూర్తి – అధ్యక్షుడి సానుభూతి
తాజా సమాచారం ప్రకారం, సహాయక చర్యలు పూర్తి అయ్యాయి. ప్రాణ నష్టం పరిమితంగానే ఉండటంతో కొంత ఊరటగా భావిస్తున్నారు. తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున తక్షణ సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాధితుల పట్ల తాము నిఖార్సైన మానవతా ధృక్పథంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
అప్రమత్తంగా ఉండాలని సూచన
తుర్కియే భౌగోళికంగా ప్రధాన భూకంప మండలంలో ఉండటంతో ఇటువంటి ప్రకంపనలు తరచూ సంభవిస్తుంటాయి. ఈ ఘటన అనంతరం కూడా తేలికపాటి ఆఫ్టర్షాక్స్ నమోదు అవుతుండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: