हिन्दी | Epaper

Telugu News: Trump-భారత్ కు వందశాతం సుంకాలతో ట్రంప్ నిర్ణయం

Pooja
Telugu News: Trump-భారత్ కు వందశాతం సుంకాలతో ట్రంప్ నిర్ణయం

Trump-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నవిధంగానే భారతదేశంపై భారీ సుంకాలను విధించారు. ఇటీవల భారతదేశం చైనా, రష్యాలతో స్నేహసంబంధాలను పెంచుకుంటూ ఉండడం ట్రంప్ కు గిట్టని వ్యవహారంగా మారింది. తమను కాదని వేరేదేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడం గిట్టని ట్రంప్ మరింత భారాన్ని మోపుతున్నారు. ఇందులో భాగంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine war) ఇంకా కొనసాగుతూనే ఉందని, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందనే కారణంగా ట్రంప్ 25 శాతం నుంచి 50శాతానికి సుంకాలను విధించారు. అంతేకాక భారత్, చైనాతో పాటు ఆయా దేశాల దిగుమతులపై వందశాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ (ఇయూ) దేశాలను కోరినట్లు తెలుస్తోంది.

Trump

అధికారులతో భేటీ అయిన ట్రంప్

వాషింగ్టన్ లో సీనియర్ అమెరికన్, యూరోపియన్ యూనియన్ అధికారులు (European Union officials) రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై భేటీ అయ్యారు. ఈయూ అధికారులతో ట్రంప్ కాన్ఫరేన్స్ కాల్లో మాట్లాడారు. రష్యా మరింత ఆర్థిక ఒత్తిడిని తీసుకొచ్చేందుకు భారత్, చైనాపై వందశాతం సుంకం విధించాలని వారికి సూచించినట్లు సమాచారం. ఆ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపేస్తామని చెప్పేవరకు ఈ సుంకాలు కొనసాగించాలని కోరారు.

ట్రంప్ సూచనలు అమలుకు సిద్ధమన్న యూరోపియన్ యూనియన్

ట్రంప్ చెప్పిన వందశాతం టారిఫ్(Tariff) లను విధించేందుకు సిద్ధమవుతున్న వేళ, ఆయన సూచనలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యూరోపియన్ యూనియన్ అధికారులు పేర్కొన్నారు. భారతదేశంపై నిత్యం ఆరోపణలు చేస్తున్న ట్రంప్ రష్యా నుంచి అధిక చమురు కొనుగోలు చేస్తున్ననాటి నుంచి ఇండియాపై కక్షకట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. భారత్ నిర్ణయం వల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నదని నిందలు మోపుతున్నారు. అధిక సుంకాలతో ఇండియాపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. అయినా కూడా భారత్ ఎక్కడా వెనుకంజ వేయలేదు. తమదేశ ప్రయోజనాల కోసం ఎంత నష్టాలను అయినా భరిస్తామని కేంద్రం తేల్చిచెప్పింది.

ట్రంప్ భారత్‌పై ఎంత సుంకం విధించారు?
ట్రంప్ భారత్‌పై వందశాతం సుంకం విధించారు.

ఈ సుంకాల వల్ల ఎలాంటి రంగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి?
ఉక్కు, అల్యూమినియం, టెక్స్టైల్, వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా ప్రభావితం అవుతాయి.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telugu-newsysrc-ysrc-is-a-poisonous-tree-minister-subhash/news/politics/544341/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

📢 For Advertisement Booking: 98481 12870