हिन्दी | Epaper

Trump: టారిఫ్‌ల వల్ల అమెరికాకు 600 బిలియన్ డాలర్ల ఆదాయం?

Aanusha
Trump: టారిఫ్‌ల వల్ల అమెరికాకు 600 బిలియన్ డాలర్ల ఆదాయం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) టారిఫ్‌ల విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా ట్రంప్ మాట్లాడుతూ, అమెరికాకు సుమారు $600 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో సుంకాలు వస్తాయని తెలిపారు. ఈ సుంకాల వల్ల దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ రెండూ చాలా బలంగా మారాయని ఆయన ప్రకటించారు. “మన దేశానికి 600 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సుంకాలు వచ్చాయి, ఇంకా రాబోతున్నాయి. కానీ ఫేక్ న్యూస్ మీడియా దీని గురించి మాట్లాడదు.

Read also: Nicolas Maduro : అమెరికా కోర్టులో మదురో: ‘నేను నిర్దోషిని’ | వెనెజువెలా సంక్షోభం

భారత ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్

ఎందుకంటే వాళ్లకు మన దేశం అంటే ద్వేషం. మనపై వారికి గౌరవం లేదు” అని మండిపడ్డారు. “ఈ మీడియా సంస్థలు రాబోయే సుప్రీంకోర్టు తీర్పును ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన తీర్పు” అని ట్రంప్ (Trump) తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. సుంకాల వల్ల అమెరికా ఆర్థికంగా, జాతీయ భద్రత విషయంలో ఎప్పుడూ లేనంత బలంగా, గౌరవంగా మారిందని ఆయన తెలిపారు.2025 జనవరిలో అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్, ఆయన బృందం టారిఫ్‌లను జాతీయ భద్రత, విదేశాంగ విధాన సాధనంగా ఉపయోగించడం ప్రారంభించడం తెలిసిందే.

Trump: Tariffs have generated $600 billion in revenue for the United States?
Trump: Tariffs have generated $600 billion in revenue for the United States?

ఈ క్రమంలోనే ప్రపంచంలోని పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించారు. ముఖ్యంగా భారత ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ విధించారు.భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్ గా ఉంది. మన దేశ మొత్తం వస్తు ఎగుమతుల్లో దాదాపు 18 శాతం అమెరికాకే వెళుతున్నాయి. గార్మెంట్స్, లెదర్ ఉత్పత్తులు వంటివి ఇందులో ప్రధానమైనవి. అయితే, వ్యవసాయం, డెయిరీ వంటి సున్నితమైన రంగాల్లో అమెరికా ఉత్పత్తులకు ద్వారాలు తెరిచే విషయంలో భారత్ దృఢమైన వైఖరితో ఉండటంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంపై సందేహాలున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కు జలహారతి

హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కు జలహారతి

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసింది: జగన్‌

అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసింది: జగన్‌

వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

📢 For Advertisement Booking: 98481 12870