అలస్కా శిఖరాగ్ర సమావేశం : ట్రంప్-పుతిన్ చర్చలు
Trump : ఆగస్టు 15, 2025న అలస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్-రిచర్డ్సన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, (Donald Trump) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశం మూడు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై స్పష్టమైన ఒప్పందం కుదరలేదు, కాల్పుల విరమణపై ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ట్రంప్ ఈ భేటీని “అత్యంత ఫలప్రదం”గా అభివర్ణించారు.
ట్రంప్ ఇంటర్వ్యూ: జెలెన్స్కీపై బాధ్యత
సమావేశం అనంతరం ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్, “ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత జెలెన్స్కీపై ఉంది. ఐరోపా దేశాలు కూడా కొంత జోక్యం చేసుకోవాలి, కానీ ప్రధాన బాధ్యత జెలెన్స్కీదే,” అని పేర్కొన్నారు. సమావేశానికి 10కి 10 మార్కులు ఇస్తున్నానని, చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలిపారు.

శాంతి చర్చలలో పురోగతి ఉన్నప్పటికీ ఒప్పందం కుదరలేదు
ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన చర్చలలో అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ, తుది ఒప్పందం ఇంకా కుదరలేదని ట్రంప్ వెల్లడించారు. “మేము పురోగతి సాధించాం, కానీ తుది ఒప్పందం కుదిరే వరకు ఏదీ కుదిరినట్టు కాదు,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లేకపోవడం విమర్శలకు కారణమైంది, ఎందుకంటే ఉక్రెయిన్ లేని చర్చలు అర్థరహితమని జెలెన్స్కీ, ఐరోపా నాయకులు హెచ్చరించారు.
జెలెన్స్కీ హెచ్చరికలు, ఐరోపా ఆందోళనలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ సమావేశానికి ఆహ్వానించబడలేదు, దీనిపై ఆయన, ఐరోపా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ (Ukraine) లేకుండా జరిగే ఏ ఒప్పందమూ చెల్లదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. “పుతిన్ శాంతి కోసం నిజాయితీగా చర్చలు జరపడానికి సిద్ధంగా లేడు,” అని ఆయన ఆరోపించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :