हिन्दी | Epaper

IT companies: విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

Vanipushpa
IT companies: విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మేనియా నడుస్తోంది. అయితే ఈ ఏఐ టెక్నాలజీని నడపాలంటే భారీ డేటా సెంటర్లు కావాలి, వాటికి విపరీతమైన విద్యుత్ అవసరం. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం.. ప్రముఖ ఐటీ కంపెనీలకు(IT companies) ఒక కీలక ఆదేశం జారీ చేసింది. ఏఐ మౌలిక సదుపాయాల వల్ల పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ ను తట్టుకోవడానికి, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును ఆయా కంపెనీలే భరించాలని ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.

Read Also: Rangrez: పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

You have to build power plants yourself.. Trump bombshell for tech companies
You have to build power plants yourself.. Trump bombshell for tech companies

టెక్ కంపెనీలపై భారం ఎందుకు?

అమెరికాలోని ప్రధాన గ్రిడ్ నెట్‌వర్క్‌లైన ‘PJM Interconnection’ వంటి వాటిపై డేటా సెంటర్ల వల్ల విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. దాదాపు 6.5 కోట్ల మందికి విద్యుత్ అందించే ఈ వ్యవస్థలో ఏఐ డేటా సెంటర్ల డిమాండ్ పెరగడం వల్ల సామాన్య వినియోగదారుల విద్యుత్ బిల్లులు భారీగా పెరుగుతున్నాయి. ఒక అంచనా ప్రకారం.. డేటా సెంటర్ల డిమాండ్ వల్ల దాదాపు 23 బిలియన్ డాలర్ల అదనపు సామర్థ్య ఖర్చులు పెరిగాయి. ఈ భారాన్ని సాధారణ గృహ వినియోగదారులు లేదా చిన్న వ్యాపారస్తుల మీద వేయకుండా, డిమాండ్‌ కు కారణమైన ఐటీ కంపెనీలు (IT companies) భరించాలని పాలసీదారులు వాదిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870