हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Switzerland: రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం

Rajitha
Switzerland: రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం

అప్పటివరకు వారంతా కొత్త సంవత్స రాన్ని ఆనందంగా ఆహ్వానించేందుకు భారీ ఎత్తున వేడుకల్ని ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో ఉల్లాసంగా కేరింతలు ఆడుతున్న సమయం.. ఆకాశమే మా హద్దు అంటూ ఉత్సాహంగా ఆడిపాడుతున్నారు. రానున్న కొత్త ఏడాది తమ కుటుంబాలు మరింత ఆనందంతో ఉప్పొంగిపోవాలనే ఆరాటం ప్రతివారి మదిలో నిండుకుని ఉంది. అందుకే ప్రపంచాన్నే మర్చిపోయి, తమదైన ఆనందసాగరంలో మునిగిపోయారు. కానీ అనుకోని విపత్తు ఒక్కసారిగా వచ్చి, వారిలో అనేకుల మరణానికి కారణమైంది. న్యూఇయర్ వేళ స్విట్జర్లాండ్ (switzerland) లో అంతులేని విషాదం చోటు చేసుకుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఘోర విషాదం చోటు చేసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతున్న సమయంలో ఊహించని విపత్తు సంభవించడంతో పెను విషాదం చోటు చేసుకుంది. లగ్జరీ స్కీ రిసార్ట్ బార్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 47 మంది దుర్మరణం చెందగా.. 115మంది గాయపడ్డారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు
చేస్తున్నారు.

Read also: Usman Khawaja: రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

Resort bar tragedy

Resort bar tragedy

అందరూ ఒకేచోట చేరడంతోనే పెరిగిన మృతుల సంఖ్య

నూతన సంవత్సరం వేళ క్రాన్స్ – మోంటానాలోని ఆలైన్ రిసార్ట్ బార్ లోని వందలాది మంది వినోదంలో మునిగిపోయారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తప్పించుకునేందుకు అందరూ ఒకే దగ్గరకు చేరారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొని కేకలు, అరుపులతో అటుఇటు పరుగులు తీశారు. అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించేసరికి అనేకులు మృత్యువాత పడ్డారు. దీంతో 47 మంది సజీవదహనం అయ్యారు. 115 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్నస్థలంలో మండే పదార్థాలను ఆకస్మాత్తుగా మండించడం వల్లే పేలుడు సంభవించిందని.. దీంతో వేగంగా మంటలు వ్యాపించాయని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.

మంటలకు కారణం ఏమిటి?

అమెరికాకు చెందిన నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రకారం వేడి వాయువులు గదిలో వ్యాప్తి చెంది వేగంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఫ్లాష్ ఓవర్ సంభవిస్తుందని పేర్కొంది. ఈ కారణంగా మండే వస్తువులు అన్నీ ఒకేసారి మండిపోతాయని తెలిపింది. మంటల్లో గది కాలిపోయిందని ఫైర్ సేఫ్టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉపాధ్యక్షుడు, ఎగ్జికూటివ్ డైరెక్టర్ స్టీవ్ కెర్బర్ తెలిపారు. దుర్ఘటనపై స్విట్జర్లాండ్ అధ్యక్షుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తీవ్ర విషాధమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మరణించిన వారి జ్ఞాపకార్థంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాలపై జెండాలను సగం వరకు అవనతం చేయాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డిసెంబర్‌లోనే  ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు పెరుగుతాయి?

డిసెంబర్‌లోనే  ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు పెరుగుతాయి?

రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి ..

నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న లైంగిక దాడి ..

ఇబ్రహీంపట్నంలో హైడ్రామా..మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

ఇబ్రహీంపట్నంలో హైడ్రామా..మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

కపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం

కొత్త జట్టుతో పాక్ సవాల్.. నమీబియాపై గెలుపు సాధ్యమేనా?

కొత్త జట్టుతో పాక్ సవాల్.. నమీబియాపై గెలుపు సాధ్యమేనా?

కెనడాపై న్యూజిలాండ్‌ ఘన విజయం

కెనడాపై న్యూజిలాండ్‌ ఘన విజయం

వైసిపి నేతలపై టిడిపి గ్రీవెన్స్ లో ఫిర్యాదు

వైసిపి నేతలపై టిడిపి గ్రీవెన్స్ లో ఫిర్యాదు

జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం
1:48

జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు దుర్మరణం

ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం

లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం

రేవంత్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

రేవంత్ రెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

📢 For Advertisement Booking: 98481 12870