పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యం దృష్ట్యా ఫ్రాన్స్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు సోషల్ మీడియా (Social Media) యాక్సెస్ను పూర్తిగా నిలిపివేయాలని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నిర్ణయించారు. నూతన సంవత్సర ప్రసంగంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. “మన పిల్లలను, కౌమార దశలో ఉన్నవారిని సోషల్ మీడియా, డిజిటల్ స్క్రీన్ల దుష్ప్రభావాల నుంచి కాపాడుకుంటాం” అని ప్రకటించారు.
Read also: New Year 2026 : న్యూజిలాండ్లో ఘనంగా నూతన సంవత్సర స్వాగతం
మొట్ట మొదటి సారిగా ఆస్ట్రేలియా కఠిన చట్టం అమలు చేసింది
ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా(Social Media) ను నిషేధిస్తూ ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా కఠిన చట్టాన్ని తీసుకు వచ్చింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అదే బాటలో పయనిస్తూ 15 ఏళ్ల వయస్సును ‘డిజిటల్ మెజారిటీ’గా నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత చట్టంపై ఈ నెలలోనే ఫ్రాన్స్ పార్లమెంట్లో చర్చ జరగనుంది. 2026 సెప్టెంబర్ నాటికి ఈ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్ లో కూడా అసభ్యకరమైన కంటెంట్ పై ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలు స్మార్ట్ఫోన్ల మత్తులో పడి తమ బాల్యాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి కఠిన చట్టాలు తప్పవని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఫ్రాన్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా దిక్సూచిగా మారే అవకాశం ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: