ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా సోమవారం గాజా(Gaza)లోని రఫా బార్డర్ క్రాసింగ్ను తెరిచారు. అయితే ఈ మార్గం మీదుగా పరిమిత స్థాయిలోనే రాకపోకలకు గాజా పౌరులకు అనుమతులను ఇచ్చారు. ఈ వివరాలను ఈజిప్ట్, ఇజ్రాయెల్ భద్రతా విభాగాల అధికారులు మీడియాకు వెల్లడించారు. 50 మంది పాలస్తీనియన్లను గాజాలోకి వచ్చేందుకు, మరో 50 మందిని గాజా నుంచి వెళ్లేందుకు అనుమతించామని వారు తెలిపారు. అయితే ఏ రకమైన సరుకులకూ గాజాలోకి ప్రవేశం కల్పించలేదన్నారు. వైద్యచికిత్సల కోసం ఈజిప్టుకు వెళ్లేందుకు గాజాలోని దాదాపు 20వేల మంది పాలస్తీనా బాలలు, వయోజనులు ప్రస్తుతం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. రఫా బార్డర్ క్రాసింగ్ను పూర్తిస్థాయిలో తెరిస్తేనే వీరంతా ఈజిప్టుకు వెళ్లి వైద్యచికిత్సలు చేయించుకునే వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం వేలాది మంది పాలస్తీనావాసులు ఈజిప్టు సరిహద్దు ప్రాంతాల్లో శరణార్ధులుగా జీవిస్తున్నారు.
Read Also: Global GDP: అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

గాజా పౌరుల రాకపోకలకు అనుమతులు
“రఫా బార్డర్ క్రాసింగ్ మీదుగా జరిగేే కదలికలను యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలకు చెందిన బార్డర్ పెట్రోల్ ఏజెంట్లు పర్యవేక్షిస్తున్నారు. వారి పర్యవేక్షణలోనే గాజా పౌరుల రాకపోకలు జరుగుతున్నాయి. ఒకవేళ పరిస్థితులు అదుపులోనే ఉంటే, గాజా నుంచి ఈజిప్టుకు వెళ్లే పౌరుల సంఖ్యను విడతల వారీగా పెంచుతాం. ప్రస్తుతానికి పరిమిత స్థాయిలోనే గాజా పౌరుల రాకపోకలకు అనుమతులు ఇస్తున్నాం” అని ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెల్లడించాయి. రోజుకు 50 మంది చొప్పున గాజా పౌరులను ఈజిప్టు వైపు వెళ్లేందుకు, మరో 50 మందిని గాజాలోకి వచ్చేందుకు అనుమతిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ గతంలోనే ప్రకటించారు. ఒక్కో రోగి వెంట ఇద్దరు చొప్పున బంధువులు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇజ్రాయెల్ అధికార వర్గాలు అంటున్నాయి. ఇజ్రాయెల్ – గాజా యుద్ధం సమయంలో ఈజిప్టుకు వలస వెళ్లిన వారు సైతం ఇప్పుడు రోజుకు 50 మంది చొప్పున గాజాలోకి రావచ్చన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: