పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ (Pakistan) కోసం ఆందోళనలు జరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం స్పందించి, ఇమ్రాన్ తో ఆయన సోదరి భేటీకి అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే ఉజ్మాఖాన్ మంగళవారం మధ్యాహ్నం జైలులోకి ప్రవేశించి ఇమ్రాన్ ను కలిశారు. దీంతో ఇమ్రాన్ బతికే ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఉజ్మాఖాన్ జైల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
Read Also: Chaiwala: రెడ్ కార్పెట్ పై మోదీ టీ అమ్ముతున్నట్లుగా ఏఐ వీడియో

‘ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారు. ప్రభుత్వం ఇమ్రాను ఏకాంత నిర్బంధంలో ఉంచింది. మానసికంగా హింసిస్తున్నది. ఇమ్రాన్ ను కలిసేందుకు మేం చేసిన ఈ పోరాటం మొదటి అడుగు మాత్రమే. కోర్టు ఆర్డర్ ప్రకారం.. ఇకపై రెగ్యులర్ గా ఆయనను కలవడానికి అనుమతించాలి’ అని ప్రభుత్వాన్ని ఉజ్మాఖాన్ డిమాండ్ చేశారు.
ఆ వార్తల్లో నిజం లేదు
ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారంటూ ప్రచారం జరగడంతో పాక్ లో ఉద్రిక్తత నెలకొంది. అడియాలా జైలు వద్ద ఇమ్రాన్ అనుచరులు ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారు. రావల్పిండిలో పీటీఐ భారీ నిరసనలు నిర్వమించాలని తలపెట్టింది. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను (Imran Khan) తల్లిదండ్రులు, సోదరిమణులు, మద్దతుదారులు కలవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ రావల్పిండిలో భారీ నిరసనకు ప్లాన్ చేసింది. ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్చీ) వద్ద కూడా నిరసనలకు ప్లాన్ చేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: