పాకిస్తాన్ (Pakistan)లోని బలూచిస్థాన్ ప్రాంతం మళ్లీ తీవ్రవాద ఘటనలతో నిండిపోయింది. అక్కడి విప్లవకార సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) మరోసారి రెచ్చిపోయింది. ఇటీవల క్వెట్టా మరియు కలాట్ ప్రాంతాల్లో వరుస దాడులు నిర్వహించి పాకిస్తాన్ (Pakistan) పాక్ సైనికులు గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ ఆర్మీ ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడింది. ఐఈడీతో పేల్చేసింది. ఈ దాడిలో 29 మంది పాక్(Pakistan) సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దాడి సమయంలో బస్సులో ఆర్మీ సిబ్బందితోపాటు స్థానికులు సహా మొత్తం 48 మంది ఉన్నారు. ఈ దాడికి బీఎల్ఏ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది.

వరుస దాడులు
కాగా, పాక్లో వేర్పాటువాదులు మళ్లీ పంజా విసురుతున్నారు. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఇటీవలే వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్లు, రైల్వేలైన్లు, వాహనాలపై దాడులు చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ దాదాపు 286 దాడులు నిర్వహించింది. ఆరు నెలల్లో జరిపిన ఈ దాడుల్లో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని బలూచ్ ఆర్మీ స్వయంగా ప్రకటించింది. బలూచిస్థాన్ ప్రాంతం పాకిస్తాన్లోని అత్యంత వనరులతో కూడిన ప్రాంతం అయినప్పటికీ, అభివృద్ధి పరంగా వెనుకబడింది. స్థానికుల హక్కులు, ఆర్థిక అన్యాయం, పాక్ ఆర్మీ హింసాకాండలు వంటి అంశాల కారణంగా విప్లవవాద భావాలు పెరుగుతున్నాయి. పాక్ ప్రభుత్వం తరచుగా ఈ సంస్థల వెనుక విదేశీ మద్దతు, ముఖ్యంగా భారత్ పేరును లాగుతూ ఆరోపణలు చేస్తుంటుంది. కానీ సరైన ఆధారాలు లేవు.
బలూచిస్తాన్ జెండా?
బలూచిస్తాన్ ప్రావిన్స్ జెండా బంజరు ప్రావిన్స్ యొక్క శైలీకృత పర్వతాలను మరియు ప్రధాన రవాణా మార్గమైన ఒంటెను చూపిస్తుంది – దీనిని “ప్రావిన్షియల్ జంతువు” అని కూడా పిలుస్తారు .
పాకిస్తాన్ కరెన్సీ ఏది?
పాకిస్తానీ రూపాయి (PKR) పాకిస్తానీ రూపాయి అనేది పాకిస్తాన్ కరెన్సీ. రూపాయి కరెన్సీ కోడ్ PKR, మరియు దీనిని ఉర్దూలో ‘Rs’ లేదా روپیہ అని వ్రాస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Iraq: ఇరాక్లో షాపింగ్ మాల్ అగ్నిప్రమాదం.. 50 మంది మృతి