భారత్-పాకిస్తాన్ లమధ్య ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధంలో భారత్ దే పైచేయి అయ్యింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ చిత్తుచిత్తుగాఓడిపోయి, కాల్పుల విరమణకు దిగొచ్చింది. అప్పటి నుంచి పాకిస్తాన్ ఇతర దేశాల సాయం కోసం తెగ ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఓ ఒప్పందం జరిగింది. ఈ రెండు దేశాలలో దేనిపైనైనా దిడి జరిగితే అది రెండు దేశాలపై దాడిగా పరిగణిస్తారు.
భారత్ కు ముప్పే అంటున్న నిపుణులు
ఈ కొత్త ఒప్పందంతో భారత్ కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇండియాకు పాకిస్తాన్ తో ఎప్పటి నుంచో సమస్యలు ఉన్నాయి. తాజాగా ఈ ఏడాది,ఏప్రిల్ పహల్గాం దాడి తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ తన ఉగ్రకార్యకలాపాలతో కవ్విస్తూనే ఉంది. పాక్-సౌదీ అరేబియాల ఒప్పందం (Pakistan-Saudi Arabia agreement) ప్రకారం,భవిష్యత్తులో పహల్గాం తరహాలో పాకిస్తాన్ ఉగ్రదాడికి దిగితే.. దానిపై భారత్ యుద్ధం ప్రకటించింది.
అనుకుందాం. తాజాగా జరిగిన ఒప్పందం ప్రకారం అప్పుడు యుద్ధానికి,పాక్, సౌదీ అరేబియా దేశాలు వస్తాయి. ఎందుకంటే ఏ దేశంపై దాడి చేసినా రెండు దేశాలపై చేసినట్టే అవుతుందని అంటున్నారు. ఇలా అయితే భారత్కు ముప్పు తప్పదని భావిస్తున్నారు. ఎందుకంటే సౌదీ అరేబియా బలమైన దేశం. బాగా డబ్బున్న దేశం కూడా. వారివద్ద అధునాతన ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇలాంటి దేశం పాకిస్తాను అండగా,నిలిస్తే.. ఎవరైనా గెలవడం చాలా కష్టమే అవుతుంది.

ఒప్పందాలపై పూర్తయిన సంతకాలు
భారత్ తో యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగా కూరుకునిపోయింది. అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నది. ఈ పరిస్థితిలో సౌదీ అరేబియా (Saudi Arabia)తో ఒప్పందం పాక్ కలిసి వచ్చే,వ్యవహారంగా అయింది. పాకు ఇది ఒక దౌత్యపర విజయంగా అభివర్ణిస్తున్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ (Shahbaz Sharif) బుధవారం రియాద్ లో ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
సౌదీ అరేబియాతో ఈ సమావేశాన్ని పాకిస్తాన్ ముస్లిం ప్రపంచ సోదరభావంగా చూపించింది. ఇస్లామాబాద్, రిదాద్ మధ్య ఎనిమిది దశాబ్దాల చారిత్రాత్మక, భాగస్వామ్యంతో పాటూ సోదరభావం, ఇస్లామిక్ సంఘీభావం.. భాగస్వామ్య వ్యూహాత్మక ఆసక్తులు.. సన్నిహిత రక్షణ సహకారం ఆధారంగా ఒప్పందం చేసుకున్నామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది.
సాధారణ ఒప్పందమేనని కొట్టిపారేసిన సౌదీ
ఈ ఒప్పందంపై తెగగొప్పలు చెబుతుండగా సౌదీ అరేబియా మాత్రం మిగతా ఒప్పందాల్లానే ఇదికూడా అని కొట్టిపారేసింది. రెండు దేశాలమధ్య దీర్ఘకాలిక, లోతైన సహకారాన్ని సంస్థాగతీకరించడం కోసమే చేసుకున్నామని చెప్పింది. దీని అర్థం పాకిస్తాన్ ప్రత్యర్థి భారతదేశంతో సంబంధాలను సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశానికి,ఉందని సౌదీకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: