हिन्दी | Epaper

Opal Suchata: పట్టుదల, నమ్మకమే నా విజయానికి కారణం:మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత చువాంగ్

Sharanya
Opal Suchata: పట్టుదల, నమ్మకమే నా విజయానికి కారణం:మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత చువాంగ్

ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్ విజేతగా నిలిచి, దేశానికి మొట్టమొదటి వరల్డ్ కిరీటాన్ని అందించి చరిత్ర సృష్టించారు. భారత్‌లోని హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ అంతర్జాతీయ స్థాయి అందాల పోటీ, ప్రపంచవ్యాప్తంగా 107 దేశాల నూతన ప్రతినిధులను ఒకే వేదికపైకి తెచ్చింది. అందులో ఓపల్ అద్భుత ప్రతిభ, ఆత్మవిశ్వాసం, సామాజిక దృక్పథంతో విజయం సాధించడం విశేషం.

విజయం వెనుక ఓపల్‌కి ఉన్న నమ్మకం, లక్ష్యంపై నిలకడ

తన విజయ రహస్యాన్ని వివరిస్తూ, “ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు నమ్మండి. మీ మౌలిక విలువలకు కట్టుబడి ఉండండి. నా లక్ష్యాన్ని పట్టుకుని, నన్ను నేను నమ్ముకున్నందువల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఈ ప్రయాణంలో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కూడా మర్చిపోవద్దు” అని సుచాత మీడియాకు వివరించారు. “ఇది ఎప్పుడూ సులువు కాదు, కొన్నిసార్లు అలసటగా, నిరుత్సాహంగా అనిపించవచ్చు. కానీ మీరు ఎప్పుడూ వదిలిపెట్టకపోతే మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడికి తప్పకుండా చేరుకుంటారు” అని ఆమె తెలిపారు.

థాయ్‌లాండ్‌కు తొలి మిస్ వరల్డ్ టైటిల్

ఈ పోటీల ఫైనల్‌లో ఇథియోపియాకు చెందిన హసెట్ డెరెజీ అడ్మాసు రన్నరప్‌గా నిలిచారు. కిరీటధారణ వేడుక కోసం సుచాత, ఓపల్ రత్నాల వంటి పూలతో అలంకరించిన తెలుపు రంగు గౌను ధరించారు. ఈ గౌను హీలింగ్, బలానికి ప్రతీకగా నిలిచింది. గత ఏడాది మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా, కొత్త ప్రపంచ సుందరి ఓపల్ సుచాతకు కిరీటాన్ని అలంకరించారు. ప్రపంచవ్యాప్తంగా 107 దేశాల జాతీయ విజేతలను ఓడించి సుచాత ఈ ఘనత సాధించారు. అందాల పోటీల చరిత్రలో థాయ్‌లాండ్‌కు ఇదే తొలి మిస్ వరల్డ్ కిరీటం కావడం విశేషం.

ఫైనల్‌లో పోటీదారులు – భారతదేశం నిరాశ చెందిన రోజు

కాగా, ఈ పోటీల్లో భారత్ ఆశలు త్వరగానే ఆవిరయ్యాయి. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన నందిని గుప్తా టాప్ 8 ఫైనలిస్టుల జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయారు. గత ఏడాది, 28 ఏళ్ల విరామం తర్వాత భారతదేశం (ముంబై)లో జరిగిన 71వ మిస్ వరల్డ్ పోటీల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ పోటీలో లెబనాన్‌కు చెందిన యాస్మినా జైటౌన్, ట్రినిడాడ్, టొబాగోకు చెందిన అచె అబ్రహమ్స్, బోట్స్వానాకు చెందిన లెసెగో చోంబోలను క్రిస్టినా ఓడించారు. భారత్ ఇప్పటివరకు ఆరుసార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకోగా, నటి మానుషి చిల్లర్ చివరిసారిగా భారత్ తరఫున ఈ టైటిల్‌ను సాధించారు.

Read also: Miss World 2025 : మిస్‌ వరల్డ్‌ 2025 విజేతగా థాయ్‌లాండ్‌ సుందరీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

📢 For Advertisement Booking: 98481 12870