Kim Jong Un warning US : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా కూడా తన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. అమెరికా, దక్షిణ కొరియా కలిసి నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది.
ఈ విన్యాసాలు తమపై దాడి చేసేందుకు ముందస్తు సన్నాహాలేనని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోపించారు. అమెరికా ఇలాగే దూకుడు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఇరాన్కు ఉత్తర కొరియా మద్దతు
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన తర్వాత మొజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టాడు. ఈ నిర్ణయానికి ఉత్తర కొరియా మద్దతు తెలిపింది.
ఇరాన్ ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని పేర్కొంటూ అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఉత్తర కొరియా విదేశాంగ శాఖ తీవ్రంగా విమర్శించింది.
క్రూయిజ్ మిస్సైల్ పరీక్ష
ఇటీవల ఉత్తర కొరియా తన సైనిక శక్తిని ప్రదర్శించింది. ‘చో హ్యోన్’ అనే భారీ యుద్ధ నౌక నుంచి క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగాన్ని కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె జు ఏతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు.
ఈ క్రూయిజ్ మిస్సైల్ సముద్రం నుంచి ఉపరితల లక్ష్యాలను దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సుమారు మూడు గంటల పాటు నిరంతరం లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: Velugumatla Victims: ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు

ఉత్తర కొరియా సైనిక శక్తి
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాలలో ఉత్తర కొరియా ఒకటి. ఈ దేశానికి 50 నుంచి 100 వరకు అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా. అంతేకాదు అమెరికాను నేరుగా లక్ష్యంగా చేసుకునే Hwasong-18 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ కూడా వారి వద్ద ఉంది.
అదే సమయంలో రాడార్కు దొరకని హైపర్సోనిక్ మిస్సైల్ టెక్నాలజీ కూడా ఉత్తర కొరియాకు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా, చైనా వంటి దేశాల మద్దతు కూడా ఉత్తర కొరియాకు ఉందని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :