పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)లో భారీ ఆర్థిక అవినీతి మరియు అక్రమ నియామకాల భాగోతం ఆడిటర్ జనరల్ ఆఫ్ పాకిస్థాన్ (AGP) నివేదిక ద్వారా బట్టబయలైంది. జూన్ 2023 నుంచి జులై 2024 వరకు జరిగిన ఆర్థిక అక్రమాలు, అనధికార ఖర్చులు, మరియు అక్రమ నియామకాలు రూ. 600 కోట్లకు పైగా నష్టాన్ని కలిగించాయని నివేదికలు తెలిపాయి. ఈ ఆరోపణలు ప్రస్తుత PCB చైర్మన్ మొహ్సిన్ నక్వీ(Mohsin Naqvi), మాజీ చైర్మన్లు జాకా అష్రఫ్(Jaaka Ashraif) మరియు నజమ్ సేథీలను కేంద్రీకరిస్తున్నాయి. మొహ్సిన్ నక్వీ, ఫిబ్రవరి 2024 నుంచి PCB చైర్మన్గా, పాకిస్థాన్ హోం మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు, ఈ ఆరోపణలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ఆడిట్ నివేదిక ప్రకారం..
అంతర్జాతీయ మ్యాచ్ల సెక్యూరిటీ కోసం పోలీసులకు రూ. 63.39 మిలియన్లు భోజన ఖర్చుల కింద అనధికారంగా చెల్లించారు. అంతేకాక, మీడియా డైరెక్టర్కు నెలకు రూ. 9 లక్షల జీతం, కరాచీలోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో మూడు అండర్-16 కోచ్లకు రూ. 5.4 మిలియన్లు, మరియు మ్యాచ్ అధికారులకు రూ. 3.8 మిలియన్లు అధిక రుసుముల కింద చెల్లించారు. టికెటింగ్ కాంట్రాక్టులు, మీడియా రైట్స్ను రిజర్వ్ ధర కంటే తక్కువకు ఇవ్వడం వల్ల రూ. 198 మిలియన్ల నష్టం, అంతర్జాతీయ మీడియా రైట్స్ నుంచి $99 మిలియన్లు, స్పాన్సర్షిప్ ఒప్పందాల నుంచి రూ. 5.3 బిలియన్లు వసూలు కాకపోవడం వంటి అక్రమాలు జరిగాయి.

సోషల్ మీడియాలో నక్వీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు
మొహ్సిన్ నక్వీ ఫిబ్రవరి 2024 నుంచి జూన్ 2024 వరకు యుటిలిటీ ఛార్జీలు, ఇంధనం, మరియు వసతి కోసం రూ. 4.17 మిలియన్ల అనధికార చెల్లింపులను పొందినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఆరోపణలు, ఆయనపై ఇప్పటికే ఉన్న ఒత్తిడిని మరింత పెంచాయి, ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణలో విఫలమైనందుకు ఆయనపై విమర్శలు వచ్చాయి. PCB డైరెక్టర్ (మీడియా) ఈ అక్రమాలు మొహ్సిన్ నక్వీ హయాంలో జరగలేదని, మాజీ చైర్మన్లను వివరణ కోసం సంప్రదించవచ్చని తెలిపారు. అయితే, సోషల్ మీడియాలో నక్వీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. Xలోని పోస్ట్లలో ఆయనను “నీచమైన నిర్వహణ” మరియు “క్రిమినల్ నిర్లక్ష్యం” అని విమర్శించారు.
పాకిస్థాన్ క్రికెట్ గత కొన్నేళ్లుగా రాజకీయ జోక్యం
పాకిస్థాన్ క్రికెట్ గత కొన్నేళ్లుగా రాజకీయ జోక్యం, అవినీతి, మరియు నిర్వహణ వైఫల్యాలతో సంక్షోభంలో ఉంది. 2022 డిసెంబర్ నుంచి PCBకి రమీజ్ రాజా, నజమ్ సేథీ, జాకా అష్రఫ్, మరియు మొహ్సిన్ నక్వీలు నాయకత్వం వహించారు, ఈ అస్థిరత క్రికెట్ పాలనను దెబ్బతీసింది. ఈ ఆరోపణలు పాకిస్థాన్ క్రికెట్ను “చీకటి యుగం”లోకి నెట్టాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .
మొహ్సిన్ నఖ్వీ వ్యాపారం ఏమిటి?
నఖ్వీ సిటీ మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు.
మోహ్సిన్ నఖ్వీ ఏ ఛానెల్లను కలిగి ఉన్నారు?
24 డిజిటల్ HD (ఉర్దూ: 24 ڈیجیٹل) అనేది పాకిస్తాన్లోని లాహోర్లో ఉన్న ఉర్దూ భాషా కరెంట్ అఫైర్స్ న్యూస్ టెలివిజన్ ఛానల్, ఇది 2015లో ప్రారంభించబడింది. ఈ ఛానెల్ సిటీ న్యూస్ గ్రూప్ వ్యవస్థాపకుడు మోహ్సిన్ నఖ్వీ యాజమాన్యంలో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Mohammed Siraj: సిరాజ్కు ఐసీసీ భారీ జరిమానా.. ఎందుకంటే?