భారత ఆర్థిక రంగాన్ని కుదిపేసిన రూ. 23,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ (Mehul Choksi) కి చెందిన ఆస్తులను విక్రయించేందుకు ముంబైలోని ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది.ముంబైలోని ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం,
Read also: Railway: టికెట్ బుకింగ్ వ్యవస్థలో మార్పులు
గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ (GGL) సంస్థకు చెందిన 13 అసురక్షిత ఆస్తులను (Mehul Choksi) వేలం వేయడానికి అనుమతి లభించింది. ఈ ఆస్తుల అంచనా విలువ 2018 నాటికి సుమారు రూ. 46 కోట్లుగా ఉంది.ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని ప్రత్యేక కోర్టు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్గా (FD) ఉంచాలి.
ట్రయల్ పూర్తయిన తర్వాతే ఆ డబ్బు యాజమాన్యం, జప్తుపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.వేలం వేయనున్న ఆస్తుల్లో ముఖ్యంగా.. బోరివలిలో ఉన్న నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.2.6 కోట్లు. అలాగే బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లోని భారత్ డైమండ్ బూర్స్లో 14 కార్ పార్కింగ్లతో సహా ఒక వాణిజ్య యూనిట్ ఉంది.
అసురక్షిత ఆస్తులను మాత్రమే వేలం
దీన్ని కూడా ప్రస్తుతం వేలం వేయబోతున్నారు. అయితే దీని విలువ సుమారు రూ19.7 కోట్లు. ఇక గోరేగావ్ ఈస్ట్లోని ఆరు ఇండస్ట్రియల్ గాలాలు, ఉద్యాగ్ నగర్లోని మరో గాలాను కూడా వేలం వేయనున్నారు. జైపూర్లోని కంపెనీ కేంద్రంలో ఉన్న వెండి ఇటుకలు,

సెమీ-ప్రీషియస్ రాళ్లు, ఇతర యంత్రాలను సైతం వేలం వేస్తున్నారు.అయితే ఈ వేలంలో అసురక్షిత ఆస్తులను మాత్రమే వేలం వేయాలని, సురక్షిత రుణదాతలు క్లెయిమ్ చేసిన వాటిని వేలం వేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈడీ దర్యాప్తులో GGL సంస్థ పీఎన్బీ స్కామ్లో కీలక పాత్ర పోషించింది.
బెల్జియం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ
మరోవైపు, పీఎన్బీ స్కామ్కు సంబంధించి విదేశాల్లో తలదాచుకుంటున్న చోక్సీకి బెల్జియం కోర్టులోనూ ఇటీవల గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీని భారత్కు అప్పగించడానికి ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేవని, ఆయనపై ఉన్న ఆరోపణలు ‘సమర్థనీయమైనవిగా’ కోర్టు పేర్కొంది.
చోక్సీ బెల్జియం (Belgium) పౌరుడు కాకపోవడం, ఆయన పాత్ర తీవ్రమైన నేరాలతో (క్రిమినల్ గ్యాంగ్లో భాగస్వామ్యం, మోసం, అవినీతి) ముడిపడి ఉండటం వల్ల అప్పగింత సమంజసమేనని కోర్టు తన తీర్పులో పేర్కొంది. అయితే చోక్సీ ఈ తీర్పును సవాలు చేస్తూ బెల్జియం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :