Latest Telugu News: Maria: ఆమె పోరాటం ప్రజలకు ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది

Read Time:  1 min
ఆమె పోరాటం ప్రజలకు ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది
ఆమె పోరాటం ప్రజలకు ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది
FONT SIZE
GET APP

ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసే వారికి అందించే అత్యున్నత పురస్కారం, 2025 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. వెనిజులాలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో(maria corina machado) ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికయ్యారు.

నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటానికి గుర్తింపు
నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటానికి గుర్తింపు
గత 20 ఏళ్లుగా మచాడో ప్రజాస్వామ్య ఉద్యమంలో చురుగ్గా ఉన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం ఆమె స్థాపించిన 'సుమేట్' అనే సంస్థ ద్వారా "తుపాకీ తూటాల కన్నా బ్యాలెట్ ఓట్లే ముఖ్యం" అనే నినాదంతో ఆమె ప్రజలను చైతన్యపరిచారు.
గత 20 ఏళ్లుగా మచాడో ప్రజాస్వామ్య ఉద్యమంలో చురుగ్గా ఉన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం ఆమె స్థాపించిన ‘సుమేట్’ అనే సంస్థ ద్వారా “తుపాకీ తూటాల కన్నా బ్యాలెట్ ఓట్లే ముఖ్యం” అనే నినాదంతో ఆమె ప్రజలను చైతన్యపరిచారు.
వెనిజులాలో నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు శాంతియుత పరివర్తన కోసం, ప్రజల హక్కుల కోసం మరియా కొరినా మచాడో చేస్తున్న నిరంతర కృషిని కమిటీ ప్రత్యేకంగా ప్రశంసించింది.
వెనిజులాలో నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు శాంతియుత పరివర్తన కోసం, ప్రజల హక్కుల కోసం మరియా కొరినా మచాడో చేస్తున్న నిరంతర కృషిని కమిటీ ప్రత్యేకంగా ప్రశంసించింది.
Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.