ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఏదీ చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇతర దేశాధినేతలకు భిన్నంగా వ్యవహరించడం ఆయన నైజం. కఠిన నియమాలను దేశంలో ప్రవేశపెడుతూ, ప్రజలను గడగడలాడించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నది చేసి తీరతాడు. అణ్వాయుధాలను పెంచుకోవడంపై అమెరికా లాంటి దిగ్గజ దేశాలు ఎంత వాచ్చరించినా పెడచెవిన పెట్టాడు. ఇలాంటి దేశాధినేత గారాలపట్టి బయటకు వస్తే ఇక ప్రపంచ మీడియా ఆమెవైపే ఉంటుంది. తాజాగా ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్-జు-యే మళ్లీ బహిరంగంగా కనిపించింది. తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశం ‘కుమ్ సుసన్’ స్మారకాన్ని ఆమె సందర్శించింది
Read also: Switzerland bar blast : క్రాన్స్-మోంటానా బార్ పేలుడులో పలువురు మృతి

Kim’s beloved daughter reappears in public
మూడేళ్ల నుంచి తండ్రి వెంటే తనయ..
గత మూడేళ్ల నుంచి తండ్రి కిమ్ జోంగ్ ఉన్ తోపాటు జు-యే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. కిమ్ తన కుమార్తెను అధికారిక పర్యటనలకు తీసుకువెళ్తుండడంతో భవిష్యత్తులో అధికారిక పగ్గాలు ఆమెకే అందించనున్నట్లు సంకేతాలను పంపుతున్నారని దక్షిణ కొరియా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని కిమ్ త్వరలోనే ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ మాజీ నాయకులకు నివాళులు అర్పించిన ఈ కార్యక్రమానికి కిమ్ తోపాటు అతని భార్య రి సోల్ జు, కుమార్తె కిమ్-జు-యే, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. గతేడాది కిమ్ చైనాకు అధికారిక పర్యటనకు వెళ్లిన సమయంలోనూ కిమ్-జు-యే ఆయనతో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: