हिन्दी | Epaper

Jedi Vance : మోడీ భేటీ భారత్-అమెరికా వాణిజ్య బలకరణం

Digital
Jedi Vance : మోడీ భేటీ భారత్-అమెరికా వాణిజ్య బలకరణం

న్యూఢిల్లీ: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సోమవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సహకారంలోని కీలక రంగాలపై సమీక్ష నిర్వహించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సహకారం 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. వాణిజ్య ఒప్పందం, ప్రజల శ్రేయస్సు, భౌగోళిక మరియు రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విడుదలైన అధికారిక ప్రకటనలో భారత్-అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ చర్చలు దోహదపడతాయని వెల్లడించారు. జెడి Jedi Vance కుటుంబ సభ్యులతో కలిసి న్యూఢిల్లీలోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించారు. భారత సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ఆలయ నిర్మాణాన్ని ప్రశంసించారు. ఆలయ నిర్మాణ నైపుణ్యం, కుటుంబ విలువలు, సామరస్యం వంటి అంశాలు వారికి ఎంతో ఆకర్షణగా నిలిచాయి. ఆలయంలోని కాలాతీత జ్ఞాన సందేశాలను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతికి ఇది గొప్ప ఘనతగా పేర్కొన్నారు.

 Jedi Vance : మోడీ భేటీ భారత్-అమెరికా వాణిజ్య బలకరణం
Jedi Vance : మోడీ భేటీ భారత్-అమెరికా వాణిజ్య బలకరణం

Jedi Vance : ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే దిశగా భారత్-అమెరికా చర్చలు

వాన్స్ కుటుంబానికి ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో గౌరవ వందనం స్వీకరించిన తర్వాత వారు న్యూఢిల్లీకి బయలుదేరారు. ప్రధానమంత్రి మోడీ నివాసంలో వాన్‌స్ దంపతులకు ఇచ్చిన విందులో విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్, కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నివాసంలో వాన్‌స్ కుటుంబాన్ని స్వాగతించిన మోడీ వారిని సాదరంగా ఆహ్వానించారు. మోడీ వారిని విందుకు తీసుకెళ్లారు. అనంతరం వారు జయపుర వెళ్ళినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

Read More : Modi : నేడు సౌదీ పర్యటనకు ప్రధాని మోదీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

📢 For Advertisement Booking: 98481 12870