Iran War: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో భారత్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అమెరికా హెచ్చరికలను లెక్కచేయకుండా ఇరాన్ సైనికులకు, వారి యుద్ధనౌకకు కొచ్చి తీరంలో రక్షణ కల్పించింది. గత నెల 28న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు లక్ష్యం చేసుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో భారత నౌకాదళ విన్యాసాల కోసం వచ్చిన ఇరాన్ నౌకలపై అమెరికా గురిపెట్టింది. మార్చి 4న శ్రీలంక తీరంలో ఇరాన్కు చెందిన ‘ఐరిస్’ (IRIS) యుద్ధనౌకను అమెరికా పేల్చివేసింది. ఈ దాడిలో సుమారు 180 మంది సైనికులు ఉన్న నౌక ధ్వంసమైంది.
Read Also: Viral Video: ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్

భారత్ ఆశ్రయం
తమ మిగిలిన నౌకలకు కూడా ముప్పు పొంచి ఉందని భావించిన ఇరాన్ ప్రభుత్వం, రక్షణ కల్పించాల్సిందిగా ఫిబ్రవరి 28న భారత ప్రధాని మోదీని అభ్యర్థించింది. దీనికి సానుకూలంగా స్పందించిన భారత్, మార్చి 1న అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే 180 మంది సైనికులతో కూడిన ‘లవన్’ (Lavan) యుద్ధనౌక మార్చి 4 నుంచి కొచ్చి తీరంలో సురక్షితంగా ఆశ్రయం పొందుతోంది. ఒకవేళ భారత్ ఈ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే, అమెరికా ఈ నౌకను కూడా ధ్వంసం చేసి ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని కాదని ఇరాన్కు మద్దతు తెలపడంపై దేశీయంగా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: