భారతీయులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రత్యేకంగా జాతివివక్షతతో విదేశాల్లో భారతీయులు పలు ఇబ్బందులను, అవమానాలను ఎదురొ్కంటున్నారు. ఎన్నో ఆశలతో అక్కడివెళ్లి, స్థిరపడాలనుకునేవారు అనుకోని ఉపద్రవంలో చిక్కుకుని, హతమార్చబడుతున్నారు. జాత్యాంకారంతో దూషించేవారు కొందరైతే, చంపేవారు మరికొందరు. తద్వారా భారతీయులకు ఏమాత్రం భద్రత ఉండడం లేదు. తాజాగా కెనడాలో(Canada) భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ సింగ్(Darshan Singh) సాప్సీ (68) దుండగుడి కాల్పుల్లో మరణించారు.
Read Also: Nadendla Manohar:తుఫాను ప్రభావిత జిల్లాల్లో రేషన్ పంపిణీ ప్రారంభం
‘కానమ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు దర్శన్ సింగ్ హత్య తీవ్రకలకలం రేపింది.
అబాట్స్ ఫోర్ట్(Abbot’s Fort) పోలీస్ డిపార్ట్మెంట్ వివరాల ప్రకారం, సోమవారం ఉదయం రిడ్జ్ వ్వూ డ్రైవ్ లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి, కారులో ఉన్న సాప్సీ తీగ్రాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సిబ్బంది వెంటనే వైద్య ప్రథమ చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఆయన అక్కడిక్కడే మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయని పోలీసులు
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ ఇంకా ప్రాథమిక దశలో ఉందని సార్జెంట్ పాల్ వాకర్ తెలిపారు. కేసును అబాట్స్ ఫోర్డ్ మేజర్ క్రైమ్ యూనిట్ నుంచి ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్కు బదిలీ చేశామని, తదుపరి వివరాలను వారే వెల్లడిస్తారని తెలిపారు.
వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగిన దర్శన్ సింగ్
దర్శన్ సింగ్ సాప్సీ పంజాబ్ లోని లుధియానా జిల్లా, రాజ్ గఢ్ గ్రామానికి చెందినవారు. ఒకరైతు కుటుంబానికి చెందిన ఆయన 1991లో కెనడాకు వలస వెళ్లి, వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన స్థాపించిన కానమ్ గ్రూప్, ప్రపంచంలోని అతిపెద్ద క్లాతింగ్ రీసైక్లింగ్ కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆయన గుజరాత్ లోని కాండ్లాలో కూడా వ్యాపారం నిర్వహిస్తున్నారు.
ఈ హత్య ఎక్కడ జరిగింది?
భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త ఇంటి బయట ఈ హత్య జరిగింది.
హత్యకు గురైన వ్యక్తి ఎవరు?
భారత సంతతికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఈ హత్యకు గురయ్యారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: