हिन्दी | Epaper

Trade Deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

Vanipushpa
Trade Deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

భారత్-అమెరికా(America) మధ్య జరిగిన బమధ్యంతర వాణిజ్య ఒప్పందం చుట్టూ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండు దేశాలు పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఒక వాణిజ్య ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిన వెంటనే.. అమెరికా ప్రభుత్వం ఏకపక్షంగా విడుదల చేసిన ఒక ఫ్యాక్ట్ షీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా భారత్‌పై చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలను వైట్ హౌస్ నిశ్శబ్దంగా సవరించడం రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ ఫ్యాక్ట్ షీట్ విడుదలైన ఒక రోజు తర్వాతే.. భారతదేశంపై సుంకాల కోతలకు సంబంధించి వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో ఉన్న ‘కొన్ని పప్పుధాన్యాలు’ అనే పదాలను వైట్ హౌస్ తన పాఠ్యం నుంచి తొలగించింది. ఇది మాత్రమే కాకుండా అమెరికా ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేసే విషయంలో ఉపయోగించిన భాషను కూడా గణనీయంగా మార్చింది. తొలుత భారతదేశం కట్టుబడి ఉంది (commits) అని పేర్కొనగా.. తాజా సవరణలో అదే వాక్యం భారతదేశం ఉద్దేశించింది (intends)గా మారింది.

Read Also: India: అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

Trade Deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్
Trade Deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

విడుదల చేసిన అసలు ఫ్యాక్ట్ షీట్‌లో..

భారత్ అమెరికన్ పారిశ్రామిక వస్తువులు, విస్తృత శ్రేణి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తొలగించడానికి లేదా తగ్గించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అందులో ఎండిన డిస్టిలర్స్ గ్రెయిన్స్ (DDGs), ఎర్ర జొన్నలు, చెట్టు గింజలు, తాజా, ప్రాసెస్ చేసిన పండ్లు, కొన్ని పప్పుధాన్యాలు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 6న భారత్-అమెరికా కలిసి విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో పప్పుధాన్యాలపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో, వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్‌లో కొన్ని పప్పుధాన్యాలు అనే అంశం చేరడం భారతీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై వచ్చిన స్పందనల అనంతరం.. వైట్ హౌస్ తన ఫ్యాక్ట్ షీట్‌ను సవరించి, ఆ పదాలను పూర్తిగా తొలగించింది. సవరించిన పత్రంలో భారత్ సుంకాలు తగ్గించబోయే ఉత్పత్తుల జాబితాలో ఇప్పుడు DDGs, ఎర్ర జొన్నలు, చెట్టు గింజలు, తాజా మరియు ప్రాసెస్ చేసిన పండ్లు,

భారత్ 500 బిలియన్ డాలర్లకు పైగా అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు

భారత్ 500 బిలియన్ డాలర్లకు పైగా అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని భావిస్తోంది అని పేర్కొన్నారు. తాజా పాఠ్యం ప్రకారం.. భారత్ మరిన్ని అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే ఉద్దేశం వ్యక్తం చేసింది. ఇందులో ప్రధానంగా అమెరికా ఇంధనం, ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉత్పత్తులు, బొగ్గు మరియు ఇతర వస్తువులు ఉన్నాయి. అయితే, ఇవన్నీ ఖచ్చితమైన హామీలుగా కాకుండా.. ఒక ఉద్దేశ ప్రకటనగా మాత్రమే చూపించడమే ఈ సవరణలోని అసలు మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా వైట్ హౌస్ చేసిన ఈ నిశ్శబ్ద సవరణలు భారత్-అమెరికా వాణిజ్య చర్చల్లోని సున్నితత్వాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్, పెట్రోల్ ధరలకు రెక్కలు.. ఆయిల్ సంక్షోభం ఖాయమా?

గ్యాస్, పెట్రోల్ ధరలకు రెక్కలు.. ఆయిల్ సంక్షోభం ఖాయమా?

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

యుద్ధంలోకి ఉత్తర కొరియా? అమెరికాకు కిమ్ వార్నింగ్

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, భారత్‌లో యూరియా ప్లాంట్లు మూత

దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ మళ్లీ అటాక్

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870