Rajamahendravaram tiger news : తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు దారితీస్తోంది. తాజాగా రాజమహేంద్రవరం పరిధిలోని Delhi Public School Rajahmundry సమీపంలో పెద్దపులి కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎస్వీపీఎస్ ఫంక్షన్ హాల్, స్కూల్ మధ్య ఉన్న కొబ్బరి తోటలోకి పులి వెళ్లినట్లు అటవీ అధికారులు గుర్తించారు.
గత నాలుగు రోజులుగా పాదముద్రలు మాత్రమే కనిపించగా, ఇప్పుడు ప్రత్యక్ష దృశ్యాలు వెలుగులోకి రావడంతో అప్రమత్తత పెరిగింది. ఆటోనగర్, గాడాల, దివాన్చెరువు ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నట్లు సమాచారం రావడంతో అధికారులు ట్రాప్స్ ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల పశువులపై దాడి ఘటనలు కూడా చోటుచేసుకోవడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోతున్నారు.
Read Also: Ranveer Singh: ధురంధర్ 2 లొకేషన్ మేనేజర్పై కేసు నమోదు!
పులిని సురక్షితంగా పట్టుకునేందుకు (Rajamahendravaram tiger news) అటవీ శాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. అదనంగా పూణే నుంచి వన్యప్రాణి నిపుణులను రప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: