గత శనివారం తెల్లవారుజామున అమెరికా (America) అకస్మాత్తుగా వెనిజులాపై దాడి చేసి, ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అదుపులో తీసుకుని, పెను రాజకీయ సంక్షోభానికి తెరతీశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల భారత్ (India) తీవ్ర ఆందోళన చెందుతోందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. అమెరికా, వెనిజులా ప్రభుత్వాలు చర్చించి ప్రజల శ్రేయస్సు, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. వెనిజులాపై అమెరికా సైనిక చర్య చేపట్టిన ఆనంతరం భారత్ నుంచి వచ్చిన మొదటి ప్రకట ఇదే కావడం గమనార్హం. లక్సెంబర్గ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి అయిన జేవియర్ బెట్టెల్ తో జైశంకర్ సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్ సహకారంపై ఇద్దరు నేతలు మాట్లాడారు. భారత్, లక్సెంబర్గ్ 78 సంవత్స రాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకున్నట్లు జైశంకర్ తెలిపారు. ఐరోపా సమాఖ్యలో లక్సెంబర్గ్ ను కీలక భాగస్వామిగా భారత్ చూస్తుందని అన్నారు. ‘వెనిజులాతో భారత్ కు దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ దేశప్రజలు ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి క్షేమంగా బయటపడాలని మేం ఆకాంక్షిస్తున్నాం’ అని జైశంకర్ అన్నారు.
Read also: Floods: ఇండోనేషియాలో కుండపోత వర్షం..16 మంది మృతి

ఆచితూచి స్పందించిన భారత్
వెనిజులా పై అమెరికా సైనిక దాడిపట్ల, భారత ప్రభుత్వం (India) చాలా జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా స్పందించిందని వెనిజులా మాజీ భారత రాయబారి వై.కె.సిన్హా అన్నారు. అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకొని భారత్ ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. రష్యా, చైనా దేశాలు తీవ్రంగా అమెరికా దాడిని ఖండించగా, భారత్ మాత్రం చాలా సంయమనంతో కూడిన ప్రకటన చేసిందని ఆయన అన్నారు. కాగా వెనిజులా చమురుపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనిజులా చమురును అమెరికాకు అప్పగిస్తారని.. దాదాపు 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురు స్వాధీనం చేసుకోబోతున్నామని ట్రంప్ తెలిపారు. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. అంటే దీనినిబట్టి వెనిజులా చమురును అమెరికా తన స్వాధీనంలోకి తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: