हिन्दी | Epaper

Latest News: IND vs PAK – భారత్ గెలుపు పై సూర్యకుమార్ యాదవ్ ఏమన్నారంటే?

Anusha
Latest News: IND vs PAK – భారత్ గెలుపు పై సూర్యకుమార్ యాదవ్ ఏమన్నారంటే?

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) లో భారత్‌ పాకిస్థాన్‌పై సాధించిన ఘన విజయాన్ని సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్లు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రకటించాడు. ఆదివారం జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సందర్భంగా సూర్యకుమార్ మాట్లాడుతూ, ఇటీవల పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు తాము సానుభూతి వ్యక్తం చేస్తున్నామని, జట్టు తరపున మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నాడు.

ఆయన చెప్పినట్లు, “ఈ విజయం మా కోసం కేవలం క్రికెట్ ఫలితం మాత్రమే కాదు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల ధైర్యానికి, వారి కుటుంబాలకి గౌరవ సూచకంగా మేము ఈ గెలుపుని అంకితం చేస్తున్నాం” అని స్పష్టం చేశాడు. ఆ సోషల్ మీడియాలో కూడా అభిమానులు సూర్యకుమార్ చేసిన ఈ ప్రకటనను హర్షిస్తున్నారు.

పుట్టిన రోజున గెలవడం సంతోషంగా ఉందని చెప్పాడు

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. తన పుట్టిన రోజున గెలవడం సంతోషంగా ఉందని చెప్పాడు. ‘నా బర్త్‌డే సందర్భంగా భారత్‌కు నేను ఇచ్చే ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఇది. ఆఖరి వరకు క్రీజులో ఉండి విజయ లాంఛనాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను మేం మరో సాధారణ గేమ్‌లానే భావిస్తాం.

ప్రతీ జట్టుతో మ్యాచ్‌కు ఎలా సిద్దమవుతామో ఈ మ్యాచ్‌కు అలానే రెడీ అయ్యాం. గతంలో ఇక్కడే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) లోనూ మేం స్పిన్నర్లతోనే గెలిచాం. అక్కడి నుంచే స్పిన్నర్లను ఉపయోగించడం మొదలైంది. అంతేకాకుండా స్పిన్నర్లకు నేను బిగ్ ఫ్యాన్. వారిని జట్టులోకి తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో వారు మ్యాచ్‌పై పట్టు సాధించగలరు.

పాక్‌పై సాధించిన ఈ విజయాన్ని

ఇదే సరైన సమయం.. సందర్భం భావించి మా తరఫున ఒకటి చెప్పాలనుకుంటున్నా. పహల్గామ్ ఉగ్రదాడిలోని బాధితుల కుటుంబాలకు మేం అండగా ఉంటాం. వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. పాక్‌ (PAK) పై సాధించిన ఈ విజయాన్ని ఎంతో దైర్య సాహాసాలు చూపిన భారత సాయుధ బలగాలకు అంకితం చేయాలనుకుంటున్నాం.

IND vs PAK

వారు ఇలానే స్ఫూర్తినిస్తూ ఉంటారని ఆశిస్తున్నాం. వారిని సంతోషపరిచే అవకాశం దొరికినప్పుడల్లా.. మైదానంలో గెలిచే ప్రయత్నం చేస్తాం.’అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌ను బాయ్‌కట్ చేయాలని హహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) బాధితుల కుటుంబాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో సూర్య ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. షాహీన్ షా అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33 నాటౌట్) ఒక్కడే దూకుడుగా ఆడగా.. సాహిబ్జాదా ఫర్హాన్(44 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 40) ఆచితూచి ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/18), జస్‌ప్రీత్ బుమ్రా(2/28) రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ తీసారు.

అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 47 నాటౌట్), అభిషేక్ శర్మ(13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), తిలక్ వర్మ(31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/35) ఒక్కడే మూడు వికెట్లు తీసాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ind-vs-pak-indias-big-win-over-pakistan/international/547402/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు..ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు..ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు

📢 For Advertisement Booking: 98481 12870