128 మంది మృతి.. హాంకాంగ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాద విషాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతులేని ఆవేదనను మిగిల్చిన ఈ ఉదంతంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. వందలాది మంది ఆచూకీ గల్లంతు కావడంతో తమ ప్రియుల కోసం కుటుంబ సభ్యుల ఆందోళన అంతా ఇంతా కాదు. ఒకవైపు గృహాలను కోల్పోయి, నిలువనీడ లేకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక రిలీఫ్ శిబిరాల్లో ఉంటూ, మరోవైపు తమవారు క్షేమంగా ఉన్నారో లేదో తెలియక అయోమయస్థితిలో పలు కుటుంబాలు ఉన్నాయి.
Read Also: Floods: థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి

హాంకాంగ్ చరిత్రలోనే ఊహించని రీతిలో ఘోరం జరిగిపోయింది.
గత బుధవారం సాయంత్రం హాంకాంగ్ (Hong kong) బహుళ అపార్ట్ మెంట్లలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందలాది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. తమ వారి జాడ కోసం రక్తసంబంధికులు పడుతున్న పాట్లు అన్నిఇన్ని కావు. మృతదేహాలు కాలిపోవడంతో గుర్తుపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకొందరు తమవారు క్షేమంగా రావాలంటూ ఎదురుచూస్తూ కన్నీళ్లు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటి.అగ్నిప్రమాదం తర్వాత అధికారులు రంగంలోకి దిగారు.
ప్రమాదానికి గల కారణాలపై అన్వేషస్తుండగా కీలక వీడియో వెలుగులోకి వచ్చింది.
అపార్ట్మెంట్ మరమ్మతుల కోసం రక్షణ వలయంగా పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. ఆ సెంట్రింగ్ పై ఒక కార్మికుడు ప్రమాదకర స్థితిలో సిగరెట్ తాగుతూ కనిపించాడు. సిగరెట్ తాగి అక్కడే పడేయడంతో నెమ్మదినెమ్మదిగా మంటలు అంటుకున్నాయి. వెదురు స్మాఫోల్డింగ్, మండే ఫోమ్ బోర్డుల కారణంగా వెంటనే వేగంగా మంటలు వ్యాపించినట్లుగా అధికారులు ప్రాథమికంగా కనిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సిగరెట్ కారణంగానే మంటలు అంటుకున్న విషయాన్ని అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: