हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

ఇక పై ఎన్‌ఆర్‌ఐలను ఎంఆర్‌ఐలుగా పిలుస్తాను: మంత్రి లోకేశ్‌

sumalatha chinthakayala
ఇక పై ఎన్‌ఆర్‌ఐలను ఎంఆర్‌ఐలుగా పిలుస్తాను: మంత్రి లోకేశ్‌

అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటనలో భాగంగా అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ కార్యకర్తలు, నేతలు, తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడూతూ.. విదేశాల్లో ఉండే భారతీయులను అంతా ఎన్‌ఆర్‌ఐలు అంటారని… ఇకపై వారిని ఎంఆర్‌ఐలుగా పిలుస్తానన్నారు. అయితే ఎన్‌ఆర్‌ఐలను మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ (ఎంఆర్‌ఐలు)గా అభివర్ణించిన లోకేష్, ఉన్నత విద్యను అభ్యసించిన కొందరు అమెరికాకు వచ్చినా, వారి మనసులు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. వీరి ఆలోచన శాశ్వతంగా రాష్ట్రం గురించే ఉంటుందని, అవసరమైనప్పుడు సహాయానికి రావడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పారు.

2024 ఎన్నికల్లో దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఏపీలో ఓటు వేయడానికి వచ్చారని, ఇది ఒక గొప్ప విజయమని అన్నారు. 175కి 175 అంటూ కాలర్ ఎగరేసిన వాళ్ల మొహాలు మాడిపోయేలా చేశారన్నారు. టీడీపీ మద్దతు కోసం వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, వారి మీద కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారని గుర్తుచేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పద్ధతిగా అమలు చేస్తున్నామని చెప్పిన లోకేష్, గతంలో వెయ్యి రూపాయల పింఛన్ పెంచడానికి ఐదేళ్లు పడితే..ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తుందన్నారు. ప్రభుత్వం కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు చక్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది, ఇందుకు చంద్రబాబునే కారణం అన్నారు. ఆయన పేరు చెబితే ఎక్కడైనా రెడ్ కార్పెట్ వేస్తారని గుర్తుచేశారు. సత్య నాదెళ్లతో మెయిల్ ద్వారా చర్చించడానికి వచ్చారు. రాష్ట్రం గురించి చర్చించాలన్నారు. టీడీపీకి దాని కార్యకర్తలే శక్తి, దేశంలో మరో పార్టీకి లేని విధంగా టీడీపీకి ప్రత్యేకమైన కార్యకర్తలు ఉన్నారని అన్నారు. గతంలో చేయని తప్పునకు చంద్రబాబును ఎలా బంధించారో చూశామని..ఇప్పుడు తలుచుకున్నా బాధగా ఉంటుందన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. అదే కొండంత బలం ఇచ్చిందని జగన్‌పై పోరాడే శక్తి వచ్చిందన్నారు.

కాగా, ప్రస్తుతానికి రెడ్‌బుక్‌లో మూడవ చాప్టర్ ప్రారంభిస్తున్నామని, తప్పు చేసిన వారిని దాన్ని వినిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. గత ఐదేళ్లు ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తున్నాయని, మన రాష్ట్రానికి ఎందుకు రాలేదని ఆందోళన చెందానని చెప్పారు. ప్రజలు ఈ విషయం గుర్తించారని, ఈ తీర్పు చాలా ముఖ్యమని తెలిపారు. చంద్రబాబుకు తనకు ఎవరినైనా జైలుకు పంపే సత్తా ఉన్నా, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ముఖ్యమని అన్నారు. రాష్ట్రాన్ని సరిదిద్దడానికి పెట్టుబడులు తెచ్చి ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం పని చేస్తున్నట్లు వివరించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం.. భారీ ఎత్తుకు ఎగసిపడ్డ లావా

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం.. భారీ ఎత్తుకు ఎగసిపడ్డ లావా

తొలగిన యూట్యూబ్ అంతరాయం

తొలగిన యూట్యూబ్ అంతరాయం

హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?

📢 For Advertisement Booking: 98481 12870