ప్రపంచ ఆరోగ్య(Health) సంస్థ డబ్యూహెచ్ఓ (WHO)వెబ్సైట్లో రేబిస్ గురించి ప్రచురించిన సమాచారం ప్రకారం ,150కి పైగా దేశాలలో, ప్రధానంగా ఆసియా, ఆఫ్రికాలో రేబిస్ ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్య. ఈ వ్యాధి ఏటా వేలాది మరణాలకు కారణమవుతుంది. వీటిలో 40% మరణాలు 15 సంవత్సరాలలోపు వయసు వారివే అని తెలుస్తోంది. కుక్క కాటు లేదా కుక్క గోళ్లతో గీరడం వల్ల మానవులలో 99% రేబిస్ కేసులు సంభవిస్తాయి.
Read Also: USA: మావారికి శిక్షణ ఇచ్చి..మీదేశానికి వెళ్లిపోండి.. అమెరికా మంత్రి
క్లినికల్ లక్షణాలు కనిపించకముందే వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థకి సోకిన 100% కేసులలో రేబిస్ ప్రాణాంతకమే. అయితే, తక్షణమే పోస్ట్-ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ చికిత్స అందించడం ద్వారా రేబిస్ మరణాలను నివారించవచ్చు, ఇది వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థకు చేరకుండా నిరోధిస్తుంది అని డబ్యూహెచ్ఓ పేర్కొంది. రేబిస్ ప్రధానంగా కుక్కలలో కనిపిస్తుంది. ఇది సోకిన జంతువుల లాలాజలంలో వైరస్ ఉంటుంది. ఈ లాలాజలం మనిషి లేదా ఇతర జంతువుల రక్తంతో కలిసినప్పుడు, శరీరంలోకి వైరస్ ప్రవేశిస్తుంది అని గాంధీనగర్లోని ఇంద్రోడా నేచర్ పార్క్-గిర్ ఫౌండేషన్లో వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అనికేత్ పటేల్ అన్నారు.

Health: వైరస్ వివిధ కణజాలాల ద్వారా ప్రయాణించి,కేంద్ర నాడీ వ్యవస్థను చేరుకుంటుంది. దీనికి కొన్ని వారాల నుంచి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. దీనిని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. వ్యాధి సోకిన జంతువుపాలు తాగడం ద్వారా వ్యాధి సంక్రమించే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, దానిని తోసిపుచ్చలేం అని ఆయన చెప్పారు. “ఏదేమైనా, మేం డబ్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటాం. ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్ను అందిస్తుంది. ఇది అన్ని పట్టణ, ప్రాథమిక, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు సివిల్ ఆసుపత్రులలో అందుబాటులో ఉంది. ఒక వ్యక్తికి రేబిస్ వచ్చే అవకాశం 1% (వైద్య భాషలో దీనిని ఆ వ్యక్తి ‘ఎక్స్పోజర్’ అంటారు)కంటే తక్కువగా ఉన్నప్పటికీ, తప్పనిసరిగా వ్యాక్సీన్ తీసుకోవాలని సూచిస్తాం. కాబట్టి రేబిస్ సోకిన గేదె పాలను కాచుకుని తాగినాసరే, ఆ వ్యక్తులను ఎక్స్పోజర్ కేటగిరీలో ఉంచడం అవసరం” అని డాక్టర్ అనికేత్ పటేల్ అంటున్నారు.
రేబిస్ వ్యాధి లక్షణాలు ఏమిటి?
రేబిస్ వ్యాధికి ఇంక్యుబేషన్ పీరియడ్ సాధారణంగా రెండు నుంచి మూడు నెలలు ఉంటుంది. అయితే లక్షణాలు బయటపడే సమయం మాత్రం వైరస్ ప్రవేశించిన ప్రదేశం, వైరల్ లోడ్ వంటి అంశాలపై ఆధారపడి వారం నుంచి ఏడాది వరకు మారొచ్చు అని డబ్యూహెచ్ఓ పేర్కొంద రేబిస్ ప్రారంభ లక్షణాలలో జ్వరం, నొప్పి, గాయమైనచోట తీవ్రమైన మంటపుట్టడం, దురద లేదా ఉంటాయి అని డబ్యూహెచ్ఓ వివరించింది. వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు, మెదడు, వెన్నుపాములలో వాపు ఏర్పడుతుంది. క్లినికల్ రేబీస్ ఉన్న రోగిలో లక్షణాలను నియంత్రించవచ్చు, కానీ వ్యాధిని పూర్తిగా తగ్గించడం అసాధ్యమని డబ్యూహెచ్ఓ పేర్కొంది.

ఒక వ్యాధి సోకిన జంతువు మరొక జంతువును కరిచినప్పుడు, రెండు రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి ఉగ్రంగా ప్రవర్తించడం, రెండోది చలనం లేకుండా ఉండడం అని డాక్టర్ అనికేత్ పటేల్ అంటున్నారు. కోపంగా మారిన జంతువు పిచ్చిగా ప్రవర్తిస్తుంది. అంటే దాడిచేయడం మొదలుపెడుతుంది. గొంతులో వాపు కారణంగా నీరు లేదా ఆహారాన్ని మింగలేకపోతుంది. చలించకుండా ఉన్న జంతువు చొంగ కార్చుతూ, పూర్తిగా నియంత్రణ కోల్పోతుంది అని ఆయన చెప్పారు.
“రేబిస్ ఉన్న మనిషికి వెలుతురు, నీరు పడకపోతే దానిని హైడ్రోఫోబియా అంటారు” అని ఆయన చెప్పారు. హైడ్రోఫోబియాకు కారణం గొంతు చుట్టూ ఉన్న కండరాల పక్షవాతం, దీని కారణంగా రోగి ఏమీ మింగలేడు. అలాగే నియంత్రణ కోల్పోతాడు. వస్తువులను కూడా కొరకాలనిపిస్తుంది. అటువంటి పరిస్థితి వస్తే ఆ రోగి రెండు నుంచి నాలుగు రోజుల్లో చనిపోయే అవకాశం ఉంది అని డాక్టర్ అనికేత్ పటేల్ తెలిపారు. ఇక టీకా విషయానికొస్తే, రేబిస్ సోకిన జంతువు లేదా కుక్క మనిషిని కరిచిన రోజు నుంచే టీకా వేయడం మొదలవుతుందని ఆయన చెబుతున్నారు. కుక్క కరిచిన రోజు నుంచి 3వరోజు, 7వరోజు, 14వరోజు, 28వ రోజుల్లో ఇస్తారు. మొత్తం ఐదు డోసుల టీకాలు అవసరం అని ఆయన తెలిపారు.
ప్రథమ చికిత్సలో, ముందుగా గాయాన్ని నీరు, యాంటిసెప్టిక్తో శుభ్రం చేయాలి. ఆపై టీకా కోసం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. గాయం కేటగిరీ 2 కంటే ఎక్కువగా ఉంటే, రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సిన్ను గాయం చుట్టూ ఉన్న ప్రాంతంలో 24 గంటల్లోపు ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు డాక్టర్ అనికేత్ పటేల్ వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: