సోషల్ మీడియా(Social media) వినియోగం మానసిక ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందనే అంశంపై హార్వర్డ్(Harvard Study) మెడికల్ స్కూల్ నిర్వహించిన తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కేవలం ఒక వారం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్లే మెంటల్ హెల్త్లో గణనీయమైన మెరుగుదల కనిపించిందని ఈ స్టడీ పేర్కొంది. డిటాక్స్ అనంతరం పాల్గొన్నవారిలో యాంగ్జైటీ లక్షణాలు 16.1 శాతం, డిప్రెషన్ 24.8 శాతం, అలాగే నిద్రలేమి (ఇన్సోమ్నియా) సమస్యలు 14.5 శాతం వరకు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది సోషల్ మీడియా వినియోగం ఎంతగా మన మనస్సుపై ఒత్తిడి పెంచుతుందో సూచిస్తోంది.
Read also: Internet Policy: మైనర్లకు సోషల్ మీడియా యాక్సెస్పై భారత్లో అవును–కాదా అనే చర్చ

రోజువారీ వినియోగం ఎంత ఉంది?
ఈ అధ్యయనంలో యువత ఫోన్ వినియోగ డేటాను విశ్లేషించగా, సాధారణ రోజుల్లో వారు సగటున రోజుకు రెండు గంటల వరకు సోషల్ మీడియా యాప్స్లో గడుపుతున్నారని తేలింది. అయితే డిటాక్స్ పీరియడ్లో ఈ సమయం గణనీయంగా తగ్గింది. వారానికి సగటు 1.9 గంటలుగా ఉన్న సోషల్ మీడియా వినియోగం కేవలం 30 నిమిషాలకు పరిమితమైంది. ఈ మార్పు మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిందని నిపుణులు చెబుతున్నారు.
ఖాళీ సమయాన్ని ఎలా వినియోగించారు?
Harvard Study: సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమయంలో పాల్గొన్నవారు ఖాళీగా ఉండలేదని అధ్యయనం వెల్లడించింది. చాలామంది బయటకు వెళ్లడం, స్నేహితులతో ప్రత్యక్షంగా కలవడం, మరికొందరు వర్కౌట్స్, యోగా, వాకింగ్ వంటి శారీరక కార్యకలాపాలు చేయడం ప్రారంభించారు. ఈ అలవాట్లు మానసిక ఉత్సాహాన్ని పెంచడమే కాకుండా, నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరిచాయని పరిశోధకులు తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సోషల్ మీడియా పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకపోయినా, కొంతకాలం డిటాక్స్ తీసుకోవడం మానసిక సమతుల్యతకు ఎంతో ఉపయోగకరం.
సోషల్ మీడియా డిటాక్స్ అంటే ఏమిటి?
కొంతకాలం పాటు సోషల్ మీడియా యాప్స్ను ఉపయోగించకుండా ఉండడమే డిటాక్స్.
ఒక వారం విరామం నిజంగా ఉపయోగమా?
అవును, హార్వర్డ్ అధ్యయనం ప్రకారం మానసిక ఆరోగ్యంలో స్పష్టమైన మెరుగుదల కనిపించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: