జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ (Friedrich Merz) తొలిసారిగా భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 12, 13 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, బెంగళూరు నగరాలను సందర్శించనున్నారు. 12వ తేదీ ఆయనకు PM మోదీ స్వాగతం పలకనున్నారు. జర్మనీ-భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి గతేడాదితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
Read also: China Xi Jinping statement : వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్పింగ్

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: