గత వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇండోనేషియా జనజీవనం స్తంభించిపోయింది. అగ్నేయాసియాలో తుఫాన్లు బీభత్సం (Floods) సృష్టించాయి. ఇండోనేషియా,(Indonesia) థాయ్లాండ్, మలేషియా,శ్రీలంక అతలాకుతలం అయ్యాయి. ఇక ఇండోనేషి యాపై భారీ జలఖడ్గం విరుచుకుపడింది. కుండపోత వర్షాలతో సుమత్రా ద్వీపాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీనికి తోడు వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి.
Read Also: Visa: ఇండియన్స్ లేకుండా అమెరికా అభివృద్ధి శూన్యం..ఎలాన్ మస్క్

ఆకస్మిక వరదలతో ఇప్పటివరకు 442 మంది చనిపోగా.. వందలాది మంది తప్పిపోయారు. ఇక లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఒకవైపు ఇళ్లు కోల్పోయి, ఆహారం, నిత్యావసర వస్తువుల కోసం పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలకు (Heavy rains) తోడు ఈదురుగాలులు, చలి తీవ్రత బాగా పెరిగింది. నిలువ నీడను కోల్పోయి, చలికి వణికిపోతున్న బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముమ్మర సహాయక చర్యలకు దిగింది. జాతీయ విపత్తు కారణంగా భారీగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
వణికిపోతున్న ద్వీప దేశాలు
అసాధారణమైన సెన్యార్, దిత్యా తుఫానులు ఆగ్నేయాసియా అంతటా విధ్వంసం సృష్టించాయి. థాయ్ లాండ్, మలేషియా, శ్రీలంక, ఇండోనేషియా దేశాలు హడలెత్తిపోయాయి. శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. దాదాపు 193 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక థాయ్ లాండ్ లో 145 మంది చనిపోయారు. ఇలా ఆగ్నేయాసియాలో తుపాన్లు కారణంగా జలప్రళయం బీభత్సం సృష్టించి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

వేలాదిమంది గల్లంతయ్యారు. విపత్తు బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్ సేవలు భారీ ఈదురుగాలులు, వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ దెబ్బతిన్నాయి. విద్యుత్, ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం వందలాది మంది తప్పిపోయినట్లుగా కథనాలు వస్తున్నాయి. సెన్సార్ తుఫాను కారణంగా ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడటం, వరదలకు ఇళ్లు కొట్టుకుపోయాయని, వేలాది భవనాలు మినిగిపోయాయయి అధికారులు తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: