అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ – ట్రంప్

Read Time:  1 min
America's southern borders
America's southern borders
FONT SIZE
GET APP

2025 సంవత్సరాన్ని స్వేచ్ఛాయుతమైన సంవత్సరంగా మార్చేందుకు పని చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అక్రమ వలసల సమస్యను పరిష్కరించడంలో ముఖ్యమైన ముందడుగుగా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించనున్నట్లు ఆయన ప్రకటించారు. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసి, అక్రమ వలసలను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకుంటాం అని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా భిన్న సంస్కృతుల సమ్మేళనంతో కూడిన గొప్ప దేశమని , ప్రతి ఒక్కరి హక్కులను రక్షించడంతో పాటు, మా దేశ సరిహద్దులను కూడా భద్రతగా ఉంచుతాం. అమెరికా ప్రజల కలలను సాకారం చేయడం మా ప్రభుత్వ లక్ష్యం అని ట్రంప్ పేర్కొన్నారు. తుపాకీ కాల్పుల ఘటన నుంచి బయటపడటం దేవుడి దయ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి తన ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తుపాకీ సంస్కృతిని నియంత్రించడం, ఆయుధాల వినియోగంపై మరింత కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికా ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే తన ప్రభుత్వ ధ్యేయమని ట్రంప్ స్పష్టం చేశారు. “రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పని చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెడతాం. దేశ అభివృద్ధి కోసం ప్రజలంతా సహకరించాలి” అని ట్రంప్ పిలుపునిచ్చారు. స్వేచ్ఛాయుత అమెరికా కోసం పనిచేసే పటిష్ఠమైన ప్రభుత్వాన్ని నిర్మిస్తామని ట్రంప్ తెలిపారు. సరిహద్దు సమస్యలతో పాటు, దేశవ్యాప్తంగా శాంతి భద్రతలు మెరుగుపరచడం మా కర్తవ్యంగా భావిస్తున్నాం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు నా ప్రతి చర్య పారదర్శకంగా ఉంటుంది అని ట్రంప్ అన్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.